Begin typing your search above and press return to search.

కరోనా ఎప్పుడు తగ్గుతుందో చెప్పేసిన బాల జ్యోతీష్యుడు !

By:  Tupaki Desk   |   31 March 2020 1:30 AM GMT
కరోనా ఎప్పుడు తగ్గుతుందో చెప్పేసిన బాల జ్యోతీష్యుడు !
X
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేస్తోంది. అసలు ఎప్పుడు ఈ వైరస్ అంతం అవుతుందో తెలియదు కానీ దీనిపై రకరకాల కథనాలు అయితే ప్రచారంలోకి వస్తున్నాయి. ఇలా జరుగుతుందని వీర బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు. అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగా... ఇప్పుడు కొత్తగా ఓ మైసూరు బాల మేధావి పేరు సోషల్ మీడియా, యూట్యూబ్ లో హోరెత్తిపోతోంది. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని భయపెట్టడం మొదలు పెట్టిన తర్వాత.. ఎంతో మంది ముందే మేం చెప్పాం కదా? అంటూ జ్యోతిష్యులు ప్రకటనలు చేస్తున్నారు.

అయితే మైసూరుకు చెందిన ఏకసంధాగ్రాహి పద్నాలుగేళ్ల అబ్బాయి అభిజ్ఞా ఆనంద్.. చెప్పిన, చెబుతున్న విషయాలను మాత్రం బాగా నమ్ముతున్నారు. ఓ రుషిలా కనిపించే అభిజ్ఞా ఆనంద్.. వేదాలు చదివేశాడు పలు భాషల్లో ప్రావీణ్యం పొందాడు.. అంతేనా చిన్న వయస్సులోనే ఎంంతో తెలిసినట్లుగా అన్నీ చెప్పేస్తున్నాడు. అసలు ఇప్పుడు ఈ మేధావి గురించి ప్రస్తావన ఎందుకంటే ఇప్పటి నుంచి ఏప్రిల్ 02 వ తేదీ వరకు కరోనాకు సంబంధించి చాలా కీలకం అంటూ అభిజ్ఞా అంటున్నాడు. అసలు ఈ బాల మేధావి చెప్పినట్టుగానే దేశంలో ఈ వైరస్ ఇంక్యుబేటర్ స్థాయి అయిపొయింది.ఈ రెండు మూడు రోజులే అత్యంత కీలకం కాబోతున్నాయి. ఇప్పుడు అభిజ్ఞా చెప్పేది కూడా ఇదే.

ఏడు నెలల క్రితమే ఓ యూట్యూబ్ వీడియో వీడియో లో ఏం చెప్పాడంటే..? 2020 లో ప్రపంచంలో ఓ బయలాజికల్ వార్ జరుగుతుందని, అప్పుడు చైనా దేశమే బాగా ఇబ్బందిపడిపోతుందని,మొత్తం రవాణా అంతా ఎక్కడికక్కడ స్థంబించిపోతుందని చెప్పాడు. దీని గురించి తాజాగా మరో వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టేశాడు. ‘‘నేను చెప్పిన వార్ నిజమే… ఒక వైరస్‌కూ ప్రపంచానికీ నడుమ జరుగుతున్న వార్ ఇది.. రవాణా స్తంభన కరెక్టే ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్లు, ఎయిర్ లైన్స్ స్తంభన నిజమే కదా… చైనా ప్రధాన సఫరర్ అనేదీ నిజమే కదా? వైరస్ అని మాత్రం చెప్పలేదు కానీ చెప్పినట్లే జరుగుతుంది కదా? అంటున్నారు. ఇక మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 చాలా కీలకమైన దశ.. లోకానికి విషమపరీక్ష రెండు నెలలపాటు కొనసాగి మే 29 వరకూ పీడించి , ఆ తరువాత ఈ కరోనా నుండి మనం పూర్తిగా బయటపడడం అని ఈ పిల్ల జ్యోతిష్యుడు చెబుతున్నాడు.