Begin typing your search above and press return to search.

పట్టాలున్నాయ్.. పట్టించుకునేవారే లేరు

By:  Tupaki Desk   |   18 March 2017 6:54 AM GMT
పట్టాలున్నాయ్.. పట్టించుకునేవారే లేరు
X
ఇండియాలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోంది.. ముఖ్యంగా ఇంజినీరింగ్ చదివినవారిలో ఉద్యోగం లేనివారి సంఖ్య భారీగా ఉంటున్నారు. ఇంజినీరింగ్ పట్టా పొంది కాలేజీ నుంచి బయటికి వచ్చే వారిలో అరకొరమందికే ఉద్యోగాలు లభ్యమవుతున్నాయి. మిగతా వారంతా ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఎంతమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారనే విషయంపై ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన గణాంకాలు చూస్తే పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అనిపిస్తోంది.

దేశవ్యాప్తంగా టెక్నికల్ ఇన్ స్టిట్యూషన్స్ లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా పొందిన వారిలో 60 శాతం మందికి పైగా అంటే ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులేనని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలిపింది. ఒక శాతం మంది కంటే తక్కువమందే సమ్మర్ ఇంటర్న్ షిప్ లో పాల్గొంటున్నారని వెల్లడించింది. కేవలం 15 శాతం ఇంజనీరింగ్ ప్రొగ్రామ్స్ నే ఇన్ స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తున్నాయని వెల్లడైంది.

కాగా ఈ పరిస్థితిని మార్చడానికి మానవ వనరుల అభివృద్ధి శాఖా టెక్నాలజీ ఎడ్యుకేషన్ ను పునరుద్ధరించడానికి ప్లాన్ చేస్తోంది. 2018 జనవరి నుంచి టెక్నికల్ ఇన్ స్టిట్యూషన్స్ అన్నింటికీ కలిపి ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని భావిస్తోంది. ఎంహెచ్ ఆర్డీ సీనియర్ అధికారుల ప్రకారం పూర్తిగా కంప్యూటర్ ఆధారితంగా నేషనల్ టెస్టింగ్ సర్వీసు ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/