Begin typing your search above and press return to search.
దారుణ ఘటన.. 6 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల కామాంధుడు అత్యాచారం !
By: Tupaki Desk | 25 Sept 2020 7:00 AM ISTఈ సమాజంలో రోజురోజుకి దారుణ ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ఎన్ని చట్టాలు , ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా తమకేమి పట్టనట్టు ప్రవర్తిస్తున్నారు. కామాంధులు వృద్ధులు, చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దేశంలో నిత్యం ఏదో మూలన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. మేడికొండూరు మండలం పేరేచర్లలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ దారుణ ఘటన పై పోలీసులు తెలిపిన వివరాలని ఒకసారి చూస్తే .. పేరేచర్లకు చెందిన భార్యాభర్తలు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఆరేళ్ల పాప కూడా ఉంది. మంగళవారం ఆ చిన్నారి ఆడుకుంటూ పేరేచర్ల జంక్షన్ కు వద్దకి వెళ్లింది. ఆ తర్వాత ఎంతసేపటికిఇంటికి రాలేదు. చీకటి పడినా పాప ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది, తమ కూతురు కనిపించడం లేదని.. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదుచేశారు. వారి ఫిర్యాదు మేరకు పేరేచర్లలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి ఆ చిన్నారిని అపహరించి తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఘటనా స్థలానికి వెళ్లి చుట్టుపక్కల మొత్తం వెతికారు. ఆ క్రమంలో రైల్వే స్టేషన్ లో ఒంటరిగా కూర్చొని పాప ఏడుస్తూ కనిపించింది. జరిగిన విషయాన్ని చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ తిన్నారు. ఆ చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని గుంటూరు రూరల్ నల్లపాడుకు చెందిన స్వామిగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. చిన్నారికి ఏవో కబుర్లు చెప్పి, రైల్వే స్టేషన్ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు వెల్లడించారు. అనంతరం తిరిగి రైల్వే స్టేషన్లో వదలిపెట్టాడని చెప్పారు. ఈ ఘటనలో నిందితుడు స్వామిని అరెస్ట్ చేసి.. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఈ దారుణ ఘటన పై పోలీసులు తెలిపిన వివరాలని ఒకసారి చూస్తే .. పేరేచర్లకు చెందిన భార్యాభర్తలు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఆరేళ్ల పాప కూడా ఉంది. మంగళవారం ఆ చిన్నారి ఆడుకుంటూ పేరేచర్ల జంక్షన్ కు వద్దకి వెళ్లింది. ఆ తర్వాత ఎంతసేపటికిఇంటికి రాలేదు. చీకటి పడినా పాప ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది, తమ కూతురు కనిపించడం లేదని.. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదుచేశారు. వారి ఫిర్యాదు మేరకు పేరేచర్లలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి ఆ చిన్నారిని అపహరించి తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఘటనా స్థలానికి వెళ్లి చుట్టుపక్కల మొత్తం వెతికారు. ఆ క్రమంలో రైల్వే స్టేషన్ లో ఒంటరిగా కూర్చొని పాప ఏడుస్తూ కనిపించింది. జరిగిన విషయాన్ని చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ తిన్నారు. ఆ చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని గుంటూరు రూరల్ నల్లపాడుకు చెందిన స్వామిగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. చిన్నారికి ఏవో కబుర్లు చెప్పి, రైల్వే స్టేషన్ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు వెల్లడించారు. అనంతరం తిరిగి రైల్వే స్టేషన్లో వదలిపెట్టాడని చెప్పారు. ఈ ఘటనలో నిందితుడు స్వామిని అరెస్ట్ చేసి.. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
