Begin typing your search above and press return to search.
అఫిషియల్: టీడీపీ గూటికి నలుగురు ఎమ్మెల్యేలు
By: Tupaki Desk | 22 Feb 2016 9:12 PM ISTచర్చోపచర్చలకు తెరపడింది. అభివృద్ధి నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు - ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం గూటికి చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో సోమవారం సాయంత్రం విజయవాడలో ఈ నాయకులు పచ్చ కండువా కప్పుకున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి - ఆయన కుమార్తె అఖిలప్రియ - జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి - విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ లు విజయవాడలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 106కు చేరింది.
వైసీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి - ఆయన కుమార్తె అఖిలప్రియ - జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి - విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ లు విజయవాడలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 106కు చేరింది.
