Begin typing your search above and press return to search.
ఆ ఐటీ కంపెనీలో కొలువుల వరద .. త్వరలో 30 వేల జాబ్స్ భర్తీ !
By: Tupaki Desk | 27 Feb 2021 12:30 AM GMTఫ్రెంచ్ టెక్నాలజీ కంపెనీ ఈ ఏడాది ఇండియాలో కొత్తగా 30వేల ఉద్యోగాలు ఇవ్వనుంది. ఈ కంపెనీకి ఇక్కడ ఇప్పటికే లక్షల మంది ఉద్యోగులున్నారు. కంపెనీ మొత్తం ఉద్యోగులలో సగం మంది ఇండియాలోనే ఉన్నారు. ఫ్రెషర్స్ తోపాటు అనుభవం ఉన్న వాళ్లకీ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు క్యాప్ జెమిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశ్విన్ యార్డి చెప్పారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్, 5జీ, సైబర్ సెక్యూరిటీ, ఇంజనీరింగ్, ఆర్అండ్డి లాంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ నైపుణ్యాలలో తాజా నియమాకలను చేపడతామన్నారు.
ఇది గత సంవత్సరంతో పోలిస్తే 25 శాతం పెరిగిందని తెలిపారు. కరోనా నేపథ్యంలో డిజిటల్ సొల్యూషన్కు పెరిగి భారీ డిమాండ్ తమవ్యాపార అవకాశాలను మెరుగుపర్చిందన్నారు. డిసెంబర్ త్రైమాసికంలో క్యాప్ జెమిని ఆదాయంలో 65 శాతం వాటా క్లౌడ్ బిజినెస్, డిజిటల్ సొల్యూషన్స్దే కావడం గమనార్హం. కరోనానుంచి కోటుకుంటున్న సమయంలో వ్యాపారి తిరిగి పుంజుకుంటుందని, భారీ డీల్స్ సాధిస్తామనే అంచనాలతో భవిష్యత్తు మరిన్ని నియామకాలు చేపట్టాలని కూడా భావిస్తున్నట్టు చెప్పారు.
అంతేకాదు, ఏప్రిల్ 2020 లో, మహమ్మారి పీక్ సమయంలో కూడా తాము వేతన పెంపును ప్రకటించామని వెల్లడించారు. దేశీయంగా మొత్తం 125,000 మంది ఉద్యోగులతో ఉన్నగత ఏడాది భారతదేశంలో దాదాపు 24 వేల నియామకాలను చేపట్టింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ నియామకాలు భారగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్ 15 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమింకోగా, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, 2021లో దాదాపు 23,000 మందిని నియమించుకోవాలని చూస్తుంది.
ఇది గత సంవత్సరంతో పోలిస్తే 25 శాతం పెరిగిందని తెలిపారు. కరోనా నేపథ్యంలో డిజిటల్ సొల్యూషన్కు పెరిగి భారీ డిమాండ్ తమవ్యాపార అవకాశాలను మెరుగుపర్చిందన్నారు. డిసెంబర్ త్రైమాసికంలో క్యాప్ జెమిని ఆదాయంలో 65 శాతం వాటా క్లౌడ్ బిజినెస్, డిజిటల్ సొల్యూషన్స్దే కావడం గమనార్హం. కరోనానుంచి కోటుకుంటున్న సమయంలో వ్యాపారి తిరిగి పుంజుకుంటుందని, భారీ డీల్స్ సాధిస్తామనే అంచనాలతో భవిష్యత్తు మరిన్ని నియామకాలు చేపట్టాలని కూడా భావిస్తున్నట్టు చెప్పారు.
అంతేకాదు, ఏప్రిల్ 2020 లో, మహమ్మారి పీక్ సమయంలో కూడా తాము వేతన పెంపును ప్రకటించామని వెల్లడించారు. దేశీయంగా మొత్తం 125,000 మంది ఉద్యోగులతో ఉన్నగత ఏడాది భారతదేశంలో దాదాపు 24 వేల నియామకాలను చేపట్టింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ నియామకాలు భారగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్ 15 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమింకోగా, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, 2021లో దాదాపు 23,000 మందిని నియమించుకోవాలని చూస్తుంది.