Begin typing your search above and press return to search.

విండీస్ - బంగ్లా టెస్టు మ్యాచ్.. ముగ్గురు భారతీయుల అరెస్టు

By:  Tupaki Desk   |   8 Feb 2021 6:00 AM GMT
విండీస్ - బంగ్లా టెస్టు మ్యాచ్.. ముగ్గురు భారతీయుల అరెస్టు
X
బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ లో జరుగుతున్న వెస్టిండీస్ - బంగ్లా క్రికెట్ టెస్టు మ్యాచ్ లో కలకలం చోటు చేసుకుంది. బెట్టింగ్ ఆరోపణలపై ముగ్గురు భారతీయుల్ని అరెస్టు చేసిన వైనం షాకింగ్ గా మారింది. కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ లు సాగుతున్న సంగతి తెలిసిందే. అలాంటివేళ.. ముగ్గురు భారతీయులు స్టేడియంలోకి చేరి.. అనుమానాస్పదంగా వ్యవహరించటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

మ్యాచ్ జరుగుతున్న జహూర్ అహ్మద్ చౌదురి స్టేడియంలోకి ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులను గమనించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టేడియంలో వారు బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లుగా ఆరోపించారు. డిజిటల్ మీమ్స్ ద్వారా వారు స్టేడియంలోనే బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లుగా బీసీబీ పేర్కొంది.

ప్రేక్షకులకు అనుమతి లేకుండా మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలోకి వారు ఎలా ప్రవేశించారు? అన్న అంశంపై విచారణ జరుపుతున్నారు. నిందితుల్ని సునీల్ కుమార్.. చేతన్ శర్మ.. సన్నీలుగా గుర్తించారు. ఏమైనా.. అనుమతి లేకుండా స్టేడియంలోకి రావటం.. బెట్టింగ్ కు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై అరెస్టు కావటం సంచలనంగా మారింది.