Begin typing your search above and press return to search.
ఏపీలో 2758 గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్
By: Tupaki Desk | 6 Feb 2020 8:00 PM ISTఆంధ్రప్రదేశ్ లో భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద 2758 గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే తెలిపారు. రాజ్యసభలో గురువారం వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ధోత్రే రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. దేశంలోని రెండున్నర లక్షల గ్రామ పంచాయతీలను కలుపుతూ దశలవారీగా బ్రాడ్ బ్యాండ్ సదుపాయం కల్పించాలన్నది భారత్ నెట్ ప్రాజెక్ట్ ఉద్దేశ్యమని ధోత్రే చెప్పారు.
భారత్ నెట్ మొదటి దశ కింద ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు - విశాఖపట్నం జిల్లాల్లో 1722 గ్రామ పంచాయతీలలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు చేపట్టినట్లు మంత్రి ధోత్రే చెప్పారు. ఇందులో 1601 గ్రామ పంచాయతీలలో బ్రాడ్ బ్యాండ్ సేవలు సిద్ధమయ్యాయని, మిగిలిన గ్రామాలలో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
భారత్ నెట్ మొదటి దశ కింద ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు - విశాఖపట్నం జిల్లాల్లో 1722 గ్రామ పంచాయతీలలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు చేపట్టినట్లు మంత్రి ధోత్రే చెప్పారు. ఇందులో 1601 గ్రామ పంచాయతీలలో బ్రాడ్ బ్యాండ్ సేవలు సిద్ధమయ్యాయని, మిగిలిన గ్రామాలలో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
