Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ గేమింగ్, పెట్టుబడుల పేరుతో 2200 కోట్ల చీటింగ్

By:  Tupaki Desk   |   30 Jan 2022 12:30 AM GMT
ఆన్ లైన్ గేమింగ్, పెట్టుబడుల పేరుతో 2200 కోట్ల చీటింగ్
X
హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగుచూసింది. ఆన్ లైన్ గేమింగ్ పెట్టుబడుల పేరుతో కేటుగాళ్లు భారీ చీటింగ్ కు పాల్పడ్డారు. 2200 కోట్లకు పైగా మోసం జరిగినట్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ గుర్తించింది. పలు బోగస్ కంపెనీలపై హైదరాబాద్ సీసీఎస్ లో ఫిర్యాదు చేసింది. నకిలీ ధ్రువ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో బోగస్ కంపెనీలు నిర్వహించినట్లుగా తెలిపింది.

బోగస్ కంపెనీల డైరెక్టర్లు, చైర్మన్లు, ప్రమోటర్లపై ఫిర్యాదు చేయడంతో పాటుగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక కేటుగాళ్లు ఆన్ లైన్ గేమ్స్, పెట్టుబడుల యాప్ ల పేరుతో నగదు తరలించినట్టుగా తెలుస్తోంది.

బోగస్ కంపెనీలు రూ.2వేల కోట్లకు పైగా తరలించినట్టుగా సమాచారం. డబ్బులను హాంకాంగ్ తరలించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మాల్ 008, మాల్ 98, వైఎస్0123, మాల్ రిబేట్.కామ్ పేర్లతో చైనీయులు ఈ మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

పెట్టుబడి పేరుతో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డారు. ఇద్దరు చైనీయులు కీలక పాత్ర పోషించినట్టుగా పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు జరుపుతున్నారు.

ఇప్పటికే చైనీయులకు బోగస్ కంపెనీలు సమకూర్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హవాలా మార్గంలో డబ్బు తరలించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.