Begin typing your search above and press return to search.
అమెరికాలో 15 ఏళ్ల తెలుగమ్మాయి ఘనత
By: Tupaki Desk | 30 Oct 2020 5:40 PM ISTఅమెరికాలో మన తెలుగమ్మాయి తళక్కున మెరిసింది. తన అందంతో అరుదైన గౌరవాన్ని అందుకుంది. అమెరికాలో స్థిరపడిన 15 ఏళ్ల తెలుగమ్మాయి నిత్యా కొడాలి అరుదైన ఘనత సాధించారు. తొలిసారి నిర్వహించిన 'మిస్ టీన్ తెలుగు యూనివర్స్' అందాల పోటీల్లో విజేతగా నిలిచారు.
భారత్ సహా 40 దేశాల నుంచి 18,000 మంది ఈ పోటీల్లో పాల్గొన్నా కూడా అందరినీ తోసిరాజని ఈ అవార్డు దక్కించుకోవడం విశేషంగా మారింది. మిస్ టీన్ తెలుగు యూనివర్స్ గ్రాండ్ ఫైనల్కు 22 మంది ఎంపికయ్యారు. ఈ ఫైనలిస్టులలో కొడాలి నిత్యా కూడా ఒకరు. ఈ పోటీల్లో తెలుగు ఉచ్ఛారణ, రాంప్ వాక్, టాలెంట్, ప్రశ్నలు- సమాధానాలు ఆధారంగా విజేతను ఎంపిక చేశారు.
నిత్యా కొడాలి విజేతగా నిలిస్తే... మొదటి రన్నరప్గా సాత్విక మోవ్వా, సెకండ్ రన్నరప్గా సుష్మితా కొల్లోజు నిలిచారు. ఫైనల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిస్ ఎర్త్ ఇండియా తేజస్విని మనోజ్ఞ హాజరయ్యారు. విజేతగా నిలిచిన నిత్యకు కీరిటాన్ని అందించారు..
సోఫోమోర్లోని ఉన్నత పాఠశాలలో నిత్య చదువుతోంది. ఆమెకు భరతనాట్యంలో కూడా ప్రవేశం ఉంది. అలాగే హ్యూస్టన్ బాలీవుడ్ నృత్య బృందంలో సభ్యురాలు. తెలుగు భాష, సంస్కృతిని ప్రోత్సహించడానికి స్వచ్ఛందంగా హ్యూస్టన్ స్థానిక తెలుగు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
ఇక తాను మొదటిసారి పాల్గొన్న పోటీల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిల్ గెలవడం పట్ల నిత్య ఆనందం వ్యక్తం చేశారు. చాలా గర్వంగా ఉందని, ఈ విజయం తనలో ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసిందని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో నిత్య రాసుకొచ్చారు.
భారత్ సహా 40 దేశాల నుంచి 18,000 మంది ఈ పోటీల్లో పాల్గొన్నా కూడా అందరినీ తోసిరాజని ఈ అవార్డు దక్కించుకోవడం విశేషంగా మారింది. మిస్ టీన్ తెలుగు యూనివర్స్ గ్రాండ్ ఫైనల్కు 22 మంది ఎంపికయ్యారు. ఈ ఫైనలిస్టులలో కొడాలి నిత్యా కూడా ఒకరు. ఈ పోటీల్లో తెలుగు ఉచ్ఛారణ, రాంప్ వాక్, టాలెంట్, ప్రశ్నలు- సమాధానాలు ఆధారంగా విజేతను ఎంపిక చేశారు.
నిత్యా కొడాలి విజేతగా నిలిస్తే... మొదటి రన్నరప్గా సాత్విక మోవ్వా, సెకండ్ రన్నరప్గా సుష్మితా కొల్లోజు నిలిచారు. ఫైనల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిస్ ఎర్త్ ఇండియా తేజస్విని మనోజ్ఞ హాజరయ్యారు. విజేతగా నిలిచిన నిత్యకు కీరిటాన్ని అందించారు..
సోఫోమోర్లోని ఉన్నత పాఠశాలలో నిత్య చదువుతోంది. ఆమెకు భరతనాట్యంలో కూడా ప్రవేశం ఉంది. అలాగే హ్యూస్టన్ బాలీవుడ్ నృత్య బృందంలో సభ్యురాలు. తెలుగు భాష, సంస్కృతిని ప్రోత్సహించడానికి స్వచ్ఛందంగా హ్యూస్టన్ స్థానిక తెలుగు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
ఇక తాను మొదటిసారి పాల్గొన్న పోటీల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిల్ గెలవడం పట్ల నిత్య ఆనందం వ్యక్తం చేశారు. చాలా గర్వంగా ఉందని, ఈ విజయం తనలో ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసిందని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో నిత్య రాసుకొచ్చారు.
