Begin typing your search above and press return to search.

పురోహితుడితో పెళ్లికూతురు జంప్‌!

By:  Tupaki Desk   |   30 May 2019 5:12 AM GMT
పురోహితుడితో పెళ్లికూతురు జంప్‌!
X
వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఈ షాకింగ్ ఉదంతం మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని విదిషి జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లివేడుక‌లో ప్ర‌ధాన పాత్ర పోషించే పురోహితుడు.. పెళ్లికుమార్తెను తీసుకెళ్లిపోయిన ఉదంతం సంచ‌ల‌నంగా మారింది. మ‌రింత షాకింగ్ విష‌యం ఏమంటే.. స‌ద‌రు పురోహితుడికి గ‌తంలో పెళ్లి జ‌రిగి.. పిల్ల‌లు కూడా ఉండ‌టం. ఇంత‌కూ ఈ ఉదంతం ఎలా చోటు చేసుకుందంటే..

తోరి బ‌గ్రోద్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల రీనా భాయి పెళ్లికి వినోద్ మ‌హ‌రాజ్ అనే పురోహితుడ్ని తీసుకొచ్చారు. మే 7న పెళ్లి జ‌రిగింది. ఇదిలా ఉంటే.. ఈ నెల 23న స‌ద‌రు పెళ్లి కుమార్తె క‌నిపించ‌కుండా పోయింది. ఇంట్లో న‌గ‌దు.. బంగారం కూడా క‌నిపించ‌లేదు.

మ‌రోవైపు.. ఇంకో పెళ్లి కోసం పురోహితుడిగా వినోద్ ను మాట్లాడుకున్నారు. తీరా పెళ్లి స‌మ‌యానికి పురోహితుడు లేక‌పోవ‌టంతో.. అత‌గాడి గురించి ఆరా తీసిన క్ర‌మంలో రీనాబాయి వెళ్లిపోయింది స‌ద‌రు పురోహితుడితోనే అన్న విష‌యం వెలుగు చూసింది. వినోద్ కు గ‌తంలోనే పెళ్లి జ‌రిగింద‌ని.. వారికి పిల్ల‌లు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. పురోహితుడి నిర్వాకంపై ఆగ్ర‌హంతో ఉన్న గ్రామ‌స్తులు.. కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్య‌వ‌హారం చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోనే కాదు.. మిగిలిన చోట్ల సంచ‌ల‌నంగా మారింది.