Begin typing your search above and press return to search.
అమెరికాలో కాల్పుల కలకలం..12మంది మృతి
By: Tupaki Desk | 19 Sept 2020 1:40 PM ISTఅగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా జరిపిన కాల్పుల్లో ఆ దేశం రక్తమోడింది. న్యూయార్క్ లోని రోచెస్టర్ లో పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో 12మంది పౌరులు అక్కడికక్కడే మృతిచెందినట్టు సమాచారం.
రోచెస్టర్ లో వేర్వేరు ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగినట్టుగా గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం ఇప్పుడు అక్కడ అర్థరాత్రి 12.30 గంటల సమయంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అమెరికాలో నల్లజాతీయులపై వివక్షకు వ్యతిరేకంగానే రోచెస్టర్ లో అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది. ఈ ఆందోళనకారులపైనే దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పెద్ద ఎత్తున పౌరులు తీవ్ర గాయాలపాలైనట్టు తెలిసింది.
కాగా అమెరికాలో కాల్పులపై అధ్యక్షుడు ట్రంప్ సహా పౌరులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కాల్పులకు గల కారణాలు.. ఎవరు చేశారన్నది తెలియాల్సి ఉంది.
రోచెస్టర్ లో వేర్వేరు ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగినట్టుగా గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం ఇప్పుడు అక్కడ అర్థరాత్రి 12.30 గంటల సమయంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అమెరికాలో నల్లజాతీయులపై వివక్షకు వ్యతిరేకంగానే రోచెస్టర్ లో అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగింది. ఈ ఆందోళనకారులపైనే దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పెద్ద ఎత్తున పౌరులు తీవ్ర గాయాలపాలైనట్టు తెలిసింది.
కాగా అమెరికాలో కాల్పులపై అధ్యక్షుడు ట్రంప్ సహా పౌరులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కాల్పులకు గల కారణాలు.. ఎవరు చేశారన్నది తెలియాల్సి ఉంది.
