Begin typing your search above and press return to search.

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి!

అవును.. యాదాద్రి జిల్లాకు చెందిన గుంటిపల్లి సౌమ్య (25) అనే యువతి రోడ్డు ప్రమాదంలో గాయపడి కన్నుమూసింది.

By:  Tupaki Desk   |   28 May 2024 3:47 AM GMT
ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి!
X

ఉన్నత చదువుల కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం అని అమెరికా వెళ్లి అక్కడ రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న భారతీయుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే! ఫలితంగా... కన్నవారికి తీవ్ర శోకాన్ని కలిగిస్తున్నాయి ఈ ఘటనలు. ఈ క్రమంలో తాజాగా మరో తెలుగు యువతి రోడ్డు ప్రమాదంలో తనువు చాలించింది.

అవును.. యాదాద్రి జిల్లాకు చెందిన గుంటిపల్లి సౌమ్య (25) అనే యువతి రోడ్డు ప్రమాదంలో గాయపడి కన్నుమూసింది. ఆదివారం అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన సౌమ్య ప్రాణాలు కోల్పోయింది.

ఆదివారం కూరగాయల కోసమని ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో సౌమ్యను కారు బలంగా ఢీకొట్టింది. దీంతో.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కూతురి మరణవార్త తెలిసి ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సౌమ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు.

యాదగిరిపల్లికి చెందిన కోటేశ్వరరావు.. సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ప్రస్తుతం కిరాణాషాపు నడుపుతూ కూతురు, కొడుకును చదివిస్తున్నారు. అయితే కోటేశ్వరరావు కూతురు సౌమ్య చిన్నప్పటి నుంచి చదువులో టాపర్ గా ఉండేది. దీంతో ఎంఎస్ చేసేందుకు సౌమ్యను అమెరికాకు పంపించారు.

ఫ్లోరిడాలోని అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎంఎస్ సీటు దక్కించుకున్న సౌమ్య.. అక్కడే పనిచేస్తూ చదువు పూర్తిచేశారు. ఇటీవలే మాస్టర్స్ పూర్తికావటంతో ఉద్యోగవేటలో ఉన్నారు. అయితే ఆదివారం అనూహ్య రీతిలో ఆమె రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.