Begin typing your search above and press return to search.

అమెరికా నుంచి వస్తూ... టీడీపీ నేత మృతి!

ఈ క్రమంలో సుమారు వారం రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతున్న వెంకటరమణ.. బుధవారం సాయంత్రం 5:12 గంటలకు ప్రాణాలు విడిచారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   22 Feb 2024 4:19 AM GMT
అమెరికా నుంచి వస్తూ... టీడీపీ నేత మృతి!
X

టీడీపీ నేత, ఎన్నారై మన్నం వెంకట రమణ (53) కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి హైదరాబాద్‌ కు బయల్దేరిన వెంకట రమణ... మార్గమధ్యంలో గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు సీపీఆర్‌ చేసిన అనంతరం... విమానాన్ని వెంటనే సమీపంలోని గ్రీస్ దేశంలోని ఏథెన్స్‌ విమానాశ్రయానికి తీసుకెళ్లి, అక్కడి ఆసుపత్రిలో చేర్చారు.

ఈ క్రమంలో సుమారు వారం రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతున్న వెంకటరమణ.. బుధవారం సాయంత్రం 5:12 గంటలకు ప్రాణాలు విడిచారని తెలుస్తుంది. ఆయన మృతి పట్ల ఎన్నారైలు దిగ్భ్రాంతి చెందారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటు టీడీపీ నేతలు వెంకటరమణ మరణంపై టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.

అమెరికాలో ఎంతోమంది తెలుగువారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వెంకట రమణ... వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పనిచేయాలని, ఎన్నికలు ముగిసే వరకూ ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుని భారత్ కు బయల్దేరారని చెబుతున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే ఇలా జరిగిపోయింది.

కాగా... ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెంకు చెందిన వెంకటరమణ... అప్పట్లో ఎంతో కష్టపడి అమెరికాకు వెళ్లినట్లు చెబుతారు! ఆయన భార్య పేరు గీత కాగా.. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు! మన్నం వెంకటరమణ 2009లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీచేసి ఓడిపోయారు.