Begin typing your search above and press return to search.

హిట్‌ కొట్టిన తర్వాతే మీడియా ముందుకు వస్తావ సర్‌ జీ?

By:  Tupaki Desk   |   2 Feb 2023 6:00 PM GMT
హిట్‌ కొట్టిన తర్వాతే మీడియా ముందుకు వస్తావ సర్‌ జీ?
X
కొరటాల శివ గత కొన్ని నెలలుగా మీడియా ముందుకు రావడం లేదు. సోషల్ మీడియాలో కూడా ఆయన లేడు అనే విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా కూడా ఎన్టీఆర్‌30 పైనే ఉంది. ఆ సినిమా తో హిట్ కొట్టిన తర్వాత మాత్రమే మీడియా ముందుకు రావాలనే పట్టుదలతో ఉన్నాడేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆచార్య సినిమా ఫ్లాప్ తో మెగా ఫ్యాన్స్ తో పాటు చాలా మంది కొరటాల శివ ను టార్గెట్‌ చేశారు. ఫ్లాప్‌ కి పూర్తి బాధ్యతను ఆయనపైనే వేయడం జరిగింది. ఆ విషయంలో కొరటాల శివ చాలా అసంతృప్తితో ఉన్నాడు అంటూ ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అందుకే విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత మాత్రమే మీడియా ముందుకు రావాలని ఆయన నిర్ణయించుకున్నాడట.

ఇటీవల పలు సినిమా ఈవెంట్స్ కు ఆయన్ను ఫిల్మ్‌ మేకర్స్ ఆహ్వానించారట. కానీ ఆయన మాత్రం ప్రతి ఒక్క ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాడు. తాజాగా కూడా ఒక సినిమా యొక్క ప్రమోషనల్‌ ఈవెంట్‌ లో పాల్గొనకుండా తన వీడియో బైట్ ను పంపించి చిత్ర యూనిట్‌ సభ్యులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు.

కొరటాల శివ చాలా కసిగా ఉన్నాడు. ఆచార్య ఫెయిల్యూర్ కు తాను కారణం కాదు అని తన మాటలతో కాకుండా ఎన్టీఆర్‌ 30 తో గట్టిగా చెప్పాలని ఆయన భావిస్తున్నాడట. అందుకే ఎన్టీఆర్‌ 30 కోసం తన సర్వం పెడుతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నెల చివర్లో లేదా వచ్చే నెలలో పట్టాలెక్కబోతున్న ఎన్టీఆర్‌ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఎన్టీఆర్‌ 30 తో హిట్ కొట్టి కొరటాల శివ మీడియా ముందుకు వస్తే కచ్చితంగా ఆయన స్థాయి.. క్రేజ్ రెట్టింపు అవ్వడం ఖాయం. ఆ రోజు కోసం ఆయన సన్నిహితులు మరియు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.