Begin typing your search above and press return to search.

స‌మంత సంచ‌ల‌న‌ నిర్ణ‌యం.. FIGHT ఫ‌ర్ టుమారో

By:  Tupaki Desk   |   24 Oct 2021 4:59 AM GMT
స‌మంత సంచ‌ల‌న‌ నిర్ణ‌యం.. FIGHT ఫ‌ర్ టుమారో
X
స‌మంత గ‌త కొన్ని రోజులుగా వార్త‌ల్లో నిలుస్తోంది. ఇటీవ‌ల నాగ‌చైత‌న్య‌తో విడిపోతున్నానంటూ ప్ర‌క‌టించిన సామ్ అంత‌కు ముందు సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటూ నిత్యం వార్త‌ల్లో నిలిచేది. విడాకుల ప్ర‌క‌ట‌న త‌రువాత కూడా సామ్ నిత్యం త‌న ఇన్ స్టా పోస్ట్ ల‌తో హాట్ టాపిక్ గా మారుతోంది. విడాకుల ప్ర‌క‌ట‌న చేసిన ద‌గ్గ‌రి నుంచి ఏదో ఒక పోస్ట్ తో త‌న అంతర్మ‌థ‌నాన్నివ్య‌క్తం చేసే ప్ర‌య‌త్నం చేస్తూనే వుంది.

ఇటీవ‌ల త‌న స్నేహితుల‌తో క‌లిసి డెహ్రాడూన్‌ తో పాటు రిషీకేష్‌ కి వెళ్లిన సామ్ అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు చేస్తూ ఆ వీడియోని అభిమానుల‌తో పంచుకుని ఆస‌క్తిని రేకెత్తించింది. ఇదే సంద‌ర్భంగా సామ్ పెట్టిన పోస్ట్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న చుట్టూ ప్ర‌స్తుతం అలుముకున్న చీక‌ట్లు తొల‌గిపోవాల‌ని ప్ర‌స్తుతం అధ్యాత్మిక యాత్ర‌లు చేస్తున్న స‌మంత తాజాగా ``ఇప్పుడు సంతోషించు.. రేప‌టి కోసం పోరాడు ..`` అంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

గ‌త కొన్ని రోజులుగా చార్ ధామ్ యాత్ర చేస్తూ హిమాల‌యాల్లో విహ‌రిస్తున్న స‌మంత తాజాగా త‌న యాత్ర‌ని దాదాపుగా పూర్తి చేసుకుంది. యుమునోత్రి నుంచి త‌న యాత్ర‌ని ప్రారంభించిన స‌మంత గంగోత్రి.. బ‌ద్రీనాథ్‌..కేదార్ నాథ్ ఆల‌యాల‌ని సంద‌ర్శించుకుంది. త‌న బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో క‌లిసి స‌మంత త‌న ఆధ్యాత్మిక యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టింది. అలాగే రిషీకేష్ లోని మ‌హేష్ యోగి ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించిన స‌మంత అక్క‌డి ఆశ్ర‌మంలో తిరుగుతున్న ఓ వీడియోని షేర్ చేసింది.

``మ‌హాభార‌తం చ‌దివిన‌ప్ప‌టి నుంచి ఈ భూమ్మీద స్వ‌ర్గం అయిన హిమాల‌యాల్లో గ‌డ‌పాల‌ని అనుకున్నాను. ఇప్ప‌డు నా క‌ల నిజ‌మైంది. నా హృద‌యంలో ఎప్పుడూ హిమాల‌యాల‌కు ప్ర‌త్యేక‌మైన స్థానం వుంటుంది`` అని పోస్ట్ చేసింది స‌మంత‌. సామ్ పోస్ట్ ల‌కు వెంక‌టేష్ కుమార్తె స‌హా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌న స్పందిస్తూ సామ్ కు అండ‌గా నిలుస్తున్నారు.

ఛార్ ధామ్ యాత్ర విశేషాలు

సమంత రూత్ ప్రభు బద్రీనాథ్ ఆలయ పర్యటనతో హిమాలయ యాత్రను ముగించారు. ఈ సంద‌ర్భంగా ఒక నోట్ ని సామ్ షేర్ చేశారు. చార్ ధామ్ యాత్రకు సంబంధించిన నాలుగు పుణ్యక్షేత్రాలను ఆమె సందర్శించారు. శనివారం ఉదయం బద్రీనాథ్ ఆలయం నుండి తన ప్రయాణ భాగస్వామి శిల్పా రెడ్డి తో క‌లిసి ఛాపర్ దగ్గర పోజులిచ్చిన చిత్రాన్ని సమంత షేర్ చేసారు. ``అద్భుత యాత్ర ముగిసింది. నేను ఎప్పుడూ హిమాలయాల విష‌యంలో ఆకర్షితురాలిన‌య్యాను ... మహాభారతం చదివినప్పటి నుండి ఈ స్వర్గాన్ని సందర్శించడం ఒక కల. భూమిపై గొప్ప రహస్య ప్రదేశం .. దేవుళ్ల నివాసమిది..`` అని వ్యాఖ్యను జోడించారు.

విహార యాత్ర‌ల్ని ముగించిన స‌మంత త‌దుప‌రి కెరీర్ పై దృష్టి సారించ‌నున్నారు. ఇక స‌మంత సినిమాల‌ విష‌యానికి వ‌స్తే గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `శాకుంత‌లం` చిత్రీక‌ర‌ణ పూర్తిచేసిన సంగ‌తి తెలిసిందే. తెలుగు.. త‌మిళ్ లో రెండు చిత్రాలు చేస్తోంది. ఇందులో డ్రీమ్ వారియ‌ర్‌ పిక్చ‌ర్స్ లో ఒక‌టి.. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ లో మ‌రొక‌టి స‌మంత చేయ‌నుంది. రెండు చిత్రాలు తెలుగు..త‌మిళ్ భాష‌ల్లో ఏక కాలంలో తెర‌కెక్క‌నున్నాయి. అలాగే బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లోనూ న‌టించేందుకు స‌మంత సిద్ధ‌మ‌వుతోంది.