Begin typing your search above and press return to search.
ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ డైరెక్టర్ కన్ఫర్మ్??
By: Tupaki Desk | 4 July 2020 6:30 AM GMTబాహుబలి తర్వాత ప్రభాస్ బాలీవుడ్ మూవీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పలు నిర్మాణ సంస్థలు ప్రభాస్ తో హిందీలో సినిమాలు చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాయి. కాని ప్రభాస్ మాత్రం ముందే కమిట్ అయ్యి ఉన్న సాహో చిత్రంను తెలుగులోనే చేశాడు. ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో చిత్రంను కూడా ముందే కమిట్ అవ్వడం వల్ల ప్రస్తుతం ఆ సినిమాను చేస్తున్నాడు. ఇదే సమయంలో నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్ తో చేయబోతున్న సినిమాకు ఓకే చెప్పాడు.
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ చిత్రం తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో ప్రభాస్ మూవీ ఉంటుందని.. అందుకు సంబంధించిన చర్చలు కూడా దాదాపుగా పూర్తి అయినట్లుగా బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా నిలిచిన ‘తానాజీ’ చిత్రాన్ని తెరకెక్కించిన ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ బాలీవుడ్ మూవీ ఉండనుందట.
సాహో సౌత్ లో నిరాశ పర్చినా కూడా ఉత్తరాదిన భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక అక్కడ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అక్కడ భారీ బడ్జెట్ తో ఓం రౌత్ దర్శకత్వంలో ఛారిత్రాత్మక నేపథ్యంలో సినిమాను చేయాలని భావిస్తున్నారట. యూవీ క్రియేషన్స్ వారు బాలీవుడ్ ఫేమస్ నిర్మాణ సంస్థతో కలిసి ప్రభాస్ బాలీవుడ్ సినిమాను నిర్మించబోతున్నారట. 2022 చివర్లో ఈ ఛారిత్రాత్మక చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ చిత్రం తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో ప్రభాస్ మూవీ ఉంటుందని.. అందుకు సంబంధించిన చర్చలు కూడా దాదాపుగా పూర్తి అయినట్లుగా బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా నిలిచిన ‘తానాజీ’ చిత్రాన్ని తెరకెక్కించిన ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ బాలీవుడ్ మూవీ ఉండనుందట.
సాహో సౌత్ లో నిరాశ పర్చినా కూడా ఉత్తరాదిన భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక అక్కడ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అక్కడ భారీ బడ్జెట్ తో ఓం రౌత్ దర్శకత్వంలో ఛారిత్రాత్మక నేపథ్యంలో సినిమాను చేయాలని భావిస్తున్నారట. యూవీ క్రియేషన్స్ వారు బాలీవుడ్ ఫేమస్ నిర్మాణ సంస్థతో కలిసి ప్రభాస్ బాలీవుడ్ సినిమాను నిర్మించబోతున్నారట. 2022 చివర్లో ఈ ఛారిత్రాత్మక చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.