Begin typing your search above and press return to search.

మహిళలను గౌరవించడం ఎన్టీఆర్ కి తెలుసు: యువనటి

By:  Tupaki Desk   |   4 Jun 2020 2:43 PM GMT
మహిళలను గౌరవించడం ఎన్టీఆర్ కి తెలుసు: యువనటి
X
2009లో మంచు మనోజ్ సరసన ప్రయాణం అనే సినిమాతో సినీ ఎంట్రీ చేసిన హీరోయిన్ పాయల్ ఘోష్. ఈ మధ్య పాయల్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తుంది. మరి తాజాగా మరోసారి పాయల్ ఎన్టీఆర్ పై ఏవో కామెంట్స్ చేసిందట.. ఆ విషయం ఏంటో చూద్దాం! సోషల్ మీడియాలో ప్రస్తుతం హీరో ఎన్టీఆర్ అభిమానులకు.. నటి మీరా చోప్రా మధ్య జరుగుతున్న మాటల యుద్దం గురించి తెలిసిందే. తనకు ఎన్టీఆర్ ఎవరో.. తెలియదని చెప్పడంతో మీరాను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే బేసిగ్గా ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన సీనియర్ నటి కుష్బూ కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకొని.. కొందరు ఎప్పటికి మారరు. నేర్చుకోరు కూడా.. ఇలాంటి విషయంలో వారు పేదవారే.. అంటూ కౌంటర్ ఇచ్చింది.

ఇక ఈ విషయం పై తాజాగా పాయల్ ఎన్టీఆర్ గురించి స్పందించింది. ట్విట్టర్లో బుధవారం రాత్రి '#askpayalghosh' కార్యక్రమం నిర్వహించింది పాయల్. అభిమానులు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఓ అభిమాని.. ''మీరు 'ఊసరవెల్లి' చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి నటించారు. ఆయనతో షూటింగ్ ఎక్స్ పీరియన్స్ చెప్పండి?'' అని పాయల్ ని అడిగితే.. "మేం బ్యాంకాక్ లో షూటింగ్ చేస్తున్నాం. ఒక సాంగ్ తీస్తున్నారు. నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. మా యూనిట్ చిన్న టెంట్ అరేంజ్ చేశారు. నేను అందులోనే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. రోడ్డుమీద ఆ టెంట్ అరేంజ్ చేయడంతో ఎన్టీఆర్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. ఆయనకు మహిళలను గౌరవించడం ఎలాగో తెలుసు. మహిళలకు ఎంతో గౌరవం ఇస్తారు" అని చెప్పింది. ఆకతాయిలు ఎవరో చేసిన పనికి ఎన్టీఆర్ ని నిలదీస్తున్న కొందరు పాయల్ ఘోష్ చెప్పిన మాటలు వింటే బావుంటుందని ఎన్టీఆర్ అభిమానులు సెటైర్స్ వేస్తున్నారు.