Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ - మనోజ్ వార్తలు కేవలం పుకార్లే
By: Tupaki Desk | 6 July 2020 5:15 AM GMTఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తర్వాత త్రివిక్రమ్ మూవీ కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ పూర్తి చేసి రెడీగా ఉన్నాడు. ఎన్టీఆర్ ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ నుండి విముక్తి అవుతాడో అప్పటి నుండి త్రివిక్రమ్ మూవీ ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రకు గాను మంచు మనోజ్ ను సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ కు ఆప్త మిత్రుడిగా పేరున్న మంచు మనోజ్ విలన్ పాత్రకు ఓకే చెప్పాడంటూ జరిగిన ప్రచారం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
మీడియాలో వస్తున్న వార్తలపై వెంటనే సోషల్ మీడియా ద్వారా మంచు మనోజ్ స్పందించాడు. అవి కేవలం పుకార్లు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటి వరకు నటీనటుల విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రతినిధులు అనధికారికంగా పేర్కొన్నారు. త్వరలోనే షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే వీలు లేకుండా ఉంది. అందుకే నటీనటుల ఎంపిక విషయాన్ని వాయిదా వేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
ఇక మరో వైపు మంచు మనోజ్ చాలా గ్యాప్ తర్వాత అహం బ్రహ్మాస్మీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయడం జరిగింది. విభిన్నమైన లుక్ లో మంచు మనోజ్ కనిపించబోతున్న ఈ చిత్రంను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయబోతున్నారట.
మీడియాలో వస్తున్న వార్తలపై వెంటనే సోషల్ మీడియా ద్వారా మంచు మనోజ్ స్పందించాడు. అవి కేవలం పుకార్లు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటి వరకు నటీనటుల విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రతినిధులు అనధికారికంగా పేర్కొన్నారు. త్వరలోనే షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే వీలు లేకుండా ఉంది. అందుకే నటీనటుల ఎంపిక విషయాన్ని వాయిదా వేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
ఇక మరో వైపు మంచు మనోజ్ చాలా గ్యాప్ తర్వాత అహం బ్రహ్మాస్మీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయడం జరిగింది. విభిన్నమైన లుక్ లో మంచు మనోజ్ కనిపించబోతున్న ఈ చిత్రంను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయబోతున్నారట.