Begin typing your search above and press return to search.

అయ్యో.. 'ఆదిపురుష్‌' ని పిల్లల కోసం అనేసింది

By:  Tupaki Desk   |   6 Feb 2023 8:00 AM GMT
అయ్యో.. ఆదిపురుష్‌ ని పిల్లల కోసం అనేసింది
X
గత ఏడాది విడుదల అయిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమా టీజర్ ను చూసిన చాలా మంది పిల్లల బొమ్మల సినిమా అన్నట్లుగా ఉందంటూ విమర్శలు చేసిన విషయం తెల్సిందే. చిన్న పిల్లల సినిమా చేశావేంటి ప్రభాస్ అంటూ చాలా మంది సోషల్‌ మీడియాలో ట్రోల్స్ చేసిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు గ్రాఫిక్స్ ను మళ్లీ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే చిన్న పిల్లల సినిమా అంటూ విమర్శలు వస్తున్న ఈ సమయంలో ఆదిపురుష్ సినిమా ను చిన్నపిల్లలు తప్పకుండా చూడాలి.. వారికి ఈ సినిమా ఒక పాఠం మాదిరిగా ఉంటుందని... రామాయణం గురించి తెలుసుకోవడంకు ఇది పిల్లలకు మంచి మార్గం అన్నట్లుగా హీరోయిన్ కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

భారీ బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమాను పిల్లల సినిమా అంటూ ట్రోల్స్ చేస్తున్నది సరిపోలేదు అన్నట్లుగా పిల్లల కోసం ఈ సినిమా అంటూ సీత పాత్ర పోషించిన కృతి సనన్ అనడంతో ఈ సినిమా కు మరింత డ్యామేజీ చేస్తుందేమో అనే ఆందోళనను ప్రభాస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

కృతి సనన్‌ అసలు ఉద్దేశ్యం మాత్రం వేరు... చిన్నప్పుడు దూరదర్శన్‌ లో రామయణ్‌ సినిమా చూడలేక పోయిన ఈతరం వారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఇలాంటి కథలు రావాల్సిన అవసరం ఉంది.. ఇది చిన్న పిల్లలకు విధ్య.. విజువల్ మెమరీ అన్నింటికి బలంగా ఉంటుంది. కనుక ఈ సినిమా తో పిల్లలకు రామాయణం చూపడం వల్ల వారు చాలా విషయాల్లో మెరుగు పడుతారు అన్నట్టుగా కృతి సనన్ చెప్పుకొచ్చింది.

ఇప్పటికే వచ్చిన విమర్శల కారణంగా గ్రాఫిక్స్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆదిపురుష్ సినిమా ను మరింత ఆలస్యం చేసి కోట్ల రూపాయల ఖర్చు చేసి గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నారు. టీజర్ లో చూపించినట్లుగా నాసిరకంగా గ్రాఫిక్స్ ఉండవనే నమ్మకంను ప్రభాస్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.