Begin typing your search above and press return to search.

లంబసింగిలో గీతా వారి షూటింగ్ ప్లాన్స్..?

By:  Tupaki Desk   |   7 July 2022 3:57 AM GMT
లంబసింగిలో గీతా వారి షూటింగ్ ప్లాన్స్..?
X
ఓవైపు విలక్షణమైన కథలతో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు పక్కా కమర్షియల్ చిత్రాలను రూపొందిస్తున్న నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్‌. ఇటీవల తమ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 8 చిత్రాన్ని హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

ఇందులో శివాని రాజశేఖర్ - శ్రీకాంత్ మేక మరియు రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 'జోహార్' 'అర్జున ఫల్గుణ' లాంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న తేజ మార్ని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో నర్సీపట్నం సమీపంలోని లంబసింగి ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌ ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోందని సమాచారం.

లంబ‌సింగి అనేది వైజాగ్ పరిసరాల్లోని అంద‌మైన ప్రాంతాల్లో ఒక‌టి. 'కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' గా పిలుస్తుంటారు. వేస‌వి కాలం - చ‌లికాలంలో అత్యంత ఎక్కువ‌మంది వీక్షించే ప్ర‌దేశమిది.

అలాంటి బ్యూటీఫుల్ లొకేషన్స్ లో జీఏ2 టీమ్ తమ ప్రొడక్షన్ నెం.8 కోసం ఓ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా కంటెంట్ ప్రధానంగా సాగే సినిమా అని మేకర్స్ ఇది వరకే తెలిపారు.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న‌ ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌ కీల‌క‌ పాత్ర‌లో నటిస్తోంది. మురళీ శర్మ - బెనర్జీ - పవన్ తేజ్ కొణిదెల తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

జీఏ2 పిక్చ‌ర్స్‌ బ్యాన‌ర్‌ పై బ‌న్నీవాసు మరియు విద్య మాధురి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భాను ప్రతాప్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు.

జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

అయితే ఇది మలయాళంలో ఘనవిజయం సాధించిన 'నాయట్టు' చిత్రానికి రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది. గతంలో గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై ఈ రీమేక్ సినిమాని ప్రారభించిన సంగతి తెలిసిందే. అదే చిత్రాన్ని వేరే టీమ్ తో చేస్తున్నారని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.