Begin typing your search above and press return to search.

తేజ అన్ని కష్టాలు చూశాడా?

By:  Tupaki Desk   |   28 May 2023 6:00 AM GMT
తేజ అన్ని కష్టాలు చూశాడా?
X
టాలీవుడ్ లో డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి తేజ. చిత్రం సినిమాతో సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా మారిన తేజ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. చిత్రం, నువ్వు నేను, జయం సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న తేజ ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిజం సినిమా చేశారు.

ఈ మూవీ కంటెంట్ బాగుందనే టాక్ వచ్చిన మేకింగ్ ఫెయిల్యూర్ కారణంగా ఫ్లాప్ అయ్యింది. ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో మహేష్ బాబుని ఆడియన్స్ యాక్సప్ట్ చేయలేకపోయారు. అది కూడా మూవీ ఫెయిల్యూర్ కి ఒక కారణం అని చెప్పాలి. తరువాత జై మూవీ పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. కళ్యాణ్ రామ్ లక్ష్మి కల్యాణం మూవీ కూడా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇది కాజల్ అగర్వాల్ మొదటి సినిమా కావడం విశేషం.

ఇక వాటి తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమా తేజ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం అహింస అనే మూవీతో దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ మూవీ కోసం తన పాత టీమ్ తో కలిసి మళ్ళీ తేజ వర్క్ చేస్తూ ఉండటం విశేషం. ఆర్పీ పట్నాయక్ సుదీర్ఘ కాలం తర్వాత మరల తెలుగులో మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా తేజ తన చిన్న నాటి జ్ఞాపకాలని ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తనకి ఒక అక్క, చెల్లి ఉన్నారని మొదటిసారి రివీల్ చేశారు. ఫైనాన్సియల్ గా భాగా ఉన్న ఉన్న ఫ్యామిలీలోనే ఉండేవారం అని అన్నారు. అయితే తన తల్లి నాకు ఊహ తెలిసే సరికి చనిపోయింది. ఆ బెంగతో కొంతకాలానికి తండ్రి కూడా చనిపోయారు. ఇక బంధువులే మా ముగ్గురిని పంచుకున్నారు.

ఒక్కొక్కరం ఒక్కో దగ్గరకి వెళ్ళిపోయాం. మాతో పాటు మా ఆస్తులు కూడా బంధువులు పంచుకున్నారు. ఒక రోజు వారు నన్ను ఆరుబయట పడుకోమని చెప్పారు. అప్పుడే ఇంటి నుంచి బయటకి వచ్చేసా. ఫుట్ పాత పై పడుకున్నా. నేను ఈ పొజిషన్ లో నిలబడానికి కారణం సినిమా. నన్ను ఇక్కడ నిలబెట్టి ఒక స్థాయి కూడా కల్పించింది ఈ సినిమానే అని పేర్కొన్నారు. అయితే నిజం సినిమా ఫ్లాప్ తో కొంత అప్సెట్ అయ్యా, దాంతో ఏకాగ్రత పోయింది, తన కొడుకు అనారోగ్యం కారణంగా కొన్నేళ్ళు సినిమాలకి దూరమయ్యానని తేజ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.