Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ ఫ్యాన్స్ ని షాక్ కు గురిచేస్తున్న మారుతి!

By:  Tupaki Desk   |   4 Dec 2022 3:30 AM GMT
ప్ర‌భాస్ ఫ్యాన్స్ ని షాక్ కు గురిచేస్తున్న మారుతి!
X
క్రేజీ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ప్ర‌స్తుతం ప్ర‌భాస్ మూడు సినిమాల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తో క‌లిసి చేస్తున్న తొలి మైథ‌లాజిక‌ల్ డ్రామా `ఆదిపురుష్‌` ని టి సిరీస్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. గ్రాఫిక్స్ మ‌రీ దారుణంగా వుండ‌టం.. టీజ‌ర్ ని నెటిజ‌న్ లు ట్రోల్ చేయ‌డంతో మ‌ళ్లీ వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ మొద‌లు పెట్టారు.

దీనితో పాటు `కేజీఎఫ్` డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో `స‌లార్` చేస్తున్నాడు. ఈ క్రేజీ మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇక నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో టైమ్ ట్రావెల్ క‌థ‌గా `ప్రాజెక్ట్ కె` రూపొందుతున్న విష‌యం తెలిసిందే. దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ మూవీని భారీ స్‌థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ లు దీపికా ప‌దుకోన్‌, దిషా ప‌టానీ హీరోయిన్ లుగా న‌టిస్తుండ‌గా బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్‌ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

ఇదిలా వుంటే అభిమానుల‌కు షాకిస్తూ ప్ర‌భాస్ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం తెలిసిందే మారుతి డైరెక్ష‌న్ లో ప్ర‌భాస్ ఓ కామెడీ హార‌ర్ థ్రిల్ల‌ర్ ని చేస్తున్నాడు. ఫ్యాన్స్ మారుతితో సినిమా రిస్క్ అని వారించినా అభిమానుల‌కు షాకిస్తూ ప్ర‌భాస్ మారుతి డైరెక్ష‌న్ లో సినిమాని అంగీక‌రించ‌డం.. రీసెంట్ గా ఆ ప్రాజెక్ట్ ని మొద‌లు పెట్ట‌డం తెలిసిందే. ఇందులో ప్ర‌భాస్ కు జోడీగా ముగ్గురు హీరోయిన్ లు న‌టిస్తున్నారు. మెయిన్ హీరోయిన్ గా మాళ‌విక మోహ‌న‌న్‌, సెకండ్ హీరోయిన్ గా నిధీ అగ‌ర్వాల్ లను ఎంపిక చేశారు.

తాజాగా `ల‌వ‌ర్‌`, రాధేశ్యామ్ చిత్రాల ఫేమ్ రిద్ది కుమార్ ని మూడ‌వ నాయిక‌గా ఫైన‌ల్ చేశారు. ఓ సినిమా థియేట‌ర్ నేప‌థ్యంలో సాగే ఈ మూవీకి `రాజా డీల‌క్స్‌` అనే టైటిల్ ని ప‌రిశీలిస్తున్న‌ట్టుగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ మూవీ కోసం ప్ర‌ముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ నేతృత్వంలో థియేట‌ర్ సెట్ ని నిర్మిస్తున్నార‌ట‌. అందులోనే దాదాపు సినిమా మొత్తం పూర్తి చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఈ మూవీ షూటింగ్ ని ప్ర‌భాస్ లేకుండానే మొద‌లు పెట్టిన మారుతి ఫ‌స్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసి సెకండ్ షెడ్యూల్ ని ప్ర‌భాస్ పై పూర్తి చేశాడ‌ట‌. తాజాగా మూడ‌వ షెడ్యూల్ ని కూడా పూర్తి చేయ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ మారుతి స్పీడుని చూసి షాక్ కు గుర‌వుతున్నార‌ట‌. అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ హార‌ర్ థ్రిల్ల‌ర్ ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.