Begin typing your search above and press return to search.

థియేట‌ర్ కి వస్తే తానెవ‌రో తెలుస్తుంద‌న్న 'ప్రేమ‌మ్' డైరెక్ట‌ర్‌!

By:  Tupaki Desk   |   28 Nov 2022 4:08 PM GMT
థియేట‌ర్ కి వస్తే తానెవ‌రో తెలుస్తుంద‌న్న ప్రేమ‌మ్ డైరెక్ట‌ర్‌!
X
సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెరిగిపోయిన త‌రువాత సెల‌బ్రిటీల‌ని ఆట ప‌ట్టించే వాళ్లు.. హ‌ద్దులు దాటి కామెంట్ లు చేసే వాళ్లు మ‌రీ ఎక్కువైపోతున్నారు. అంతే కాకుండా కొంత మంది నెటిజ‌న్ లు చేస్తున్న కామెంట్ లు సెల‌బ్రిటీల‌కు మండేలా చేస్తున్నాయి. తాజాగా ఓ నెటిజ‌న్ చేసిన కామెంట్ పై మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు స్పందించిన తీరు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారి ట్రెండ్ అవుతోంది. వివ‌రాల్లోకి వెళితే...ఎనిమిదేళ్ల క్రితం మ‌ల‌యాళంలో సంచ‌ల‌నం సృష్టించిన మూవీ `ప్రేమ‌మ్‌`. న‌వీన్ పౌలి హీరోగా న‌ప‌టించిన ఎవ‌ర్ గ్రీన్ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ ఇది.

ఈ మూవీలో సాయి ప‌ల్ల‌వి, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్ లుగా న‌టించారు. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం.. ఇత‌ర భాష‌ల్లో రీమేక్ కావ‌డంతో ఇందులో న‌టించిన ఈ ముగ్గురు హీరోయిన్ లు పాపులారిటీని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా తెలుగు ప్రేక్ష‌కులో ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ లుగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు.

ఇందులో మ‌ల‌ర్ గా న‌టించిన సాయి ప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌క హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్కించుకోగా అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్, మ‌డోన్నా సెబాస్టియ‌న్ కూడా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు.

ప్రేమ‌క‌థా సినిమాల్లో స‌రికొత్త సంచ‌ల‌నాన్ని సృష్టించిన `ప్రేమ‌మ్‌`కు ఆల్పోన్స్ పుత్రేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రికార్డు స్థాయిలో పలు అవార్డుల్ని సొంతం చేసుకున్న ఈ మూవీ త‌రువాత ఆల్పోన్స్ పుత్రేన్ `అవియ‌ల్‌` అనే అంథాల‌జీలోని ఓ భాగానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇది 2016లో విడుద‌లైంది. దీని త‌రువాత ఆల్పోన్స్ పుత్రేన్ ఆరేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ `గోల్డ్‌` మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, న‌య‌న‌తార జంట‌గా న‌టించారు.

పృథ్వీరాజ్ సుకుమార‌న్ పృథ్వీరాజ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీని నిర్మించారు. డిసెంబ‌ర్ 1న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మ‌ల‌యాళంతో పాటు త‌మిళంలోనూ ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు. రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. అయితే ఇంత వ‌ర‌కు ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేయ‌లేదు. రీసెంట్ గా ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు. ఈ నేప‌థ్యంలో ఓ నెటిజ‌న్ `గోల్డ్ ` మూవీ డిసెంబ‌ర్ 1న రిలీజ్ కాబోతోందంటూ ట్వీట్ చేశాడు.

అది చూసిన ఓ నెటిజ‌న్ ఆల్పోన్స్ పుత్రేన్ ఎవ‌రు? అని ట్వీట్ చేశాడు. వెంట‌నే లైన్ లోకి వ‌చ్చేసిన ఆల్పోన్స్ పుత్రేన్ నెటిజ‌న్ కు షాకిచ్చాడు. సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు థియేట‌ర్ కు వ‌స్తే నేనెవ‌రో తెలుస్తుంది` అంటూ స్ట్రాంగ్ గా కౌంట‌ర్ ఇచ్చాడు. దీంతో ఆల్పోన్స్ పుత్రేన్ ఇచ్చిన కౌంట‌ర్ పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.