Begin typing your search above and press return to search.

ఏప్రిల్ లో బాక్సాఫీస్ వద్ద ఏయే సినిమాలు సౌండ్ చేయబోతున్నాయి..?

By:  Tupaki Desk   |   22 Feb 2021 11:30 PM GMT
ఏప్రిల్ లో బాక్సాఫీస్ వద్ద ఏయే సినిమాలు సౌండ్ చేయబోతున్నాయి..?
X
టాలీవుడ్ లో మళ్ళీ సినిమాల సందడి మొదలైంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ నెలలో అనేక సినిమాలు ఆడియన్స్ ముందుకు రానున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ప‌వ‌న్ ఆ త‌రువాత దిల్ రాజు త‌ప్పితే ఇందులో యాక్ట్ చేస్తున్న హీరోయిన్లు ఎవ‌రో.. ఈ సినిమా దర్శకుడు ఎవరో కూడా నార్మల్ ఆడియన్స్ కి తెలియదు. అయితే పవన్ చాలా గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించే చిత్రం కావడంతో ఫ్యాన్స్ మాత్రం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నెలలో పవర్ స్టార్ సినిమా విడుద‌ల ఉండ‌టంతో మిగ‌తా సినిమాల మీద జ‌నాలు పెద్దగా ఫోక‌స్ చేయకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇదే క్రమంలో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టొరీ' సినిమా ఏప్రిల్ 16న విడుదల కానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. నేచురల్ స్టార్ నాని - శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందుతున్న 'టక్ జగదీష్' చిత్రం ఏప్రిల్ 23న రిలీజ్ కానుంది. టీజర్ సాంగ్స్ ట్రైలర్ అంటూ జగదీష్ నాయుడు బాగానే సౌండింగ్ చేస్తున్నాడు.

ఇకపోతే ఏప్రిల్ 2న గోపీచంద్ - సంపత్ నంది కాంబినేషన్ లో వస్తున్న 'సీటీమార్' సినిమా రిలీజ్ కానుంది. అలానే దగ్గుబాటి రానా - సాయి పల్లవి కలిసి నటిస్తున్న 'విరాటపర్వం' చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు. దిల్ రాజు సమర్పణలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కనున్న 'పాగల్' సినిమాని కూడా అదే నెల 30న రిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు కార్తీ - రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న 'సుల్తాన్'.. పునీత్ రాజ్ కుమార్ నటించిన 'యువ‌ర‌త్న' అనే డబ్బింగ్ సినిమాలు కూడా ఏప్రిల్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ క్రేజీ మూవీస్ లో ఎన్ని బాక్సాఫీస్ వద్ద సౌండ్ చేస్తాయో చూడాలి.