Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి ఏంటీ అలా అనేశాడు?

By:  Tupaki Desk   |   17 Aug 2022 2:37 PM GMT
రాజ‌మౌళి ఏంటీ అలా అనేశాడు?
X
టాలీవుడ్ టాప్ హీరోలు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల‌తో జక్క‌న్న తెర‌కెక్కించిన `RRR` ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు అల్లూరి సీతారామ‌రాజు, గోండు బెబ్బులి కొమురం భీంల ఫిక్ష‌న్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాలని విస్మ‌యానికి గురిచేసింది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత జ‌క్క‌న్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో క్రేజీ ప్రాజెక్ట్ ని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

SSMB29 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌పైకి రానున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్, శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్‌. నారాయ‌ణ నిర్మించ‌బోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన కీల‌క అప్ డేట్ ని తాజాగా రాజ‌మౌళి ఓ మీడియాతో మాట్లాడుతూ వెల్ల‌డించిన‌ట్టుగా తెలుస్తోంది.

అత్యంత భారీ స్థాయిలో మ‌హేష్ బాబు మూవీ కోసం ప్రిపేర్ అవుతున్న జ‌క్క‌న్న ఇప్ప‌టికే భారీ యాక్ష‌న్ ప్లాన్ ని రెడీ చేసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ని అనుకున్న విధంగా ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం సెట్స్ పైకి తీసుకురావ‌డం కుద‌ర‌ద‌ని జ‌క్క‌న్న చెప్ప‌డం షాకిస్తోంది.

అదేంటీ స్టార్ హీరో ప్రాజెక్ట్ ని అనుకున్న ప్లాన్ ప్ర‌కారం సెట్స్ పైకి తీసుక‌రాలేన‌ని జ‌క్క‌న్న అలా అనేషాడేంట‌ని అంతా విస్తూ పోతున్నార‌ట‌. అంతే కాకుండా ఈ మూవీని వ‌చ్చే ఏడాది ప్ర‌ధ‌మార్థంలో ప్రారంభిస్తాన‌ని స్ప‌ష్టం చేశార‌ట‌. అయితే ఇది ప‌క్కాగా కుదిరేలా క‌నిపించ‌డం లేద‌ని చెబుతున్నారు. కారణం త్రివిక్ర‌మ్ లో మ‌హేష్ చేస్తున్న SSMB28 అని తెలుస్తోంది. ముందు అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం అ మూవీ ఇప్ప‌టికే ప‌ట్టాలెక్కాల్సి వుంది.

కానీ ఇంత వ‌ర‌కు అది జ‌ర‌గ‌లేదు. రాజ‌మౌళి SSMB29 వ‌చ్చే ఏడాది ప్ర‌ధ‌మార్థంలో సెట్స్ పైకి వెళ్లాల‌ని ఫిక్స్ అయ్యారు. అయితే SSMB28 ఆల‌స్యం అయ్యే అవ‌కాశం వుండ‌టంతో రాజ‌మౌళి ప్లాన్ మార్చుకోవాల్సిందే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

ఇక రాజ‌మౌళి సినిమా అంటే హీరో బాడీ లాంగ్వేజ్ మారాలి, శారీర‌కంగా దృఢంగా మారాలి. దీని కోసం రెండు మూడు నెల‌లైనా ప‌డుతుంది. మ‌రి మ‌హేష్ SSMB28 ని ఫాస్ట్ గా పూర్తి చేసి అంత స‌మ‌యాన్ని రాజ‌మౌళి సినిమాకు కేటాయిస్తాడా?..అన్న‌దే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.