Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్' ఎడిట్ వెర్షన్ ను వీక్షించిన ప్రభాస్ ఏమన్నారంటే..?

By:  Tupaki Desk   |   1 July 2022 9:30 AM GMT
ఆదిపురుష్ ఎడిట్ వెర్షన్ ను వీక్షించిన ప్రభాస్ ఏమన్నారంటే..?
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథిలాజికల్ డ్రామా ''ఆదిపురుష్''. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇందులో రాఘవగా ప్రభాస్ కనిపించనుండగా.. జానకి పాత్రలో బాలీవుడ్ భామ కృతి సనన్ నటిస్తోంది. ప్రతినాయకుడు లంకేశ్ గా సైఫ్ అలీఖాన్.. లక్ష్మణ్ పాత్రను యువ హీరో సన్నీ సింగ్ పోషిస్తున్నారు.

ఇప్పటికే 'ఆది పురుష్' షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ముంబై వెళ్లిన ప్రభాస్.. ఇప్పటివరకు జరిగిన రఫ్ ఎడిట్ వెర్షన్ ను వీక్షించారట. దీనిపై డార్లింగ్ అండ్ టీమ్ హ్యాపీగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

'ఆదిపురుష్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతికతో రూపొందిస్తున్నారు. సరికొత్త అనుభూతిని అందించడానికి లేటెస్ట్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తారని సమాచారం. ఇప్పటిదాకా ఎడిట్ చేయబడిన వెర్సన్ చాలా బాగుందని ప్రభాస్ సంతోషంగా ఫీల్ అయ్యారట.

ఇందులో ప్రభాస్ మరియు కృతి సనన్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని అందరూ దర్శకుడు ఓం రౌత్ ను ప్రశంసించారని తెలుస్తోంది. ఈ అవుట్ ఫుట్ తో ప్రభాస్ సైతం ఓం రౌత్ ను అభినందించారని చెబుతున్నారు. ఇది కచ్చితంగా విజువల్ వండర్ అవుతుందని చిత్ర బృందం ధీమాగా ఉన్నారు.

'ఆదిపురుష్' చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. అయితే రిలీజ్ ఇంకా ఏడు నెలల సమయం కూడా లేకున్నా.. ఇంతవరకు ప్రమోషన్స్ చేయకపోవడం పై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని చేతిలో పెట్టుకొని కనీసం ఫస్ట్ లుక్ ని విడుదల చేయకపోవడం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి అభిమానుల మొర ఆలకించి, మేకర్స్ త్వరలోనే 'ఆదిపురుష్' సినిమా పబ్లిసిటీ మొదలు పెడతారేమో చూడాలి.

కాగా, 'ఆదిపురుష్' అనేది ప్రభాస్ కు ఫస్ట్ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ. తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటుగా విదేశీ లాంగ్వేజెస్ లలో విడుదల చేసే అవకాశం ఉంది.

టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ సంయుక్తంగా 'ఆది పురుష్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తీక్ పలనీ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సాచెత్ తాండన్ - పరంపరా ఠాకూర్ సంగీతం సమకూరుస్తున్నారు.