Begin typing your search above and press return to search.

వ్వాట్! స్మార్ట్ ఫోన్ లో `వ‌కీల్ సాబ్` స్ట్రీమింగ్!!

By:  Tupaki Desk   |   28 Feb 2021 5:12 AM GMT
వ్వాట్! స్మార్ట్ ఫోన్ లో `వ‌కీల్ సాబ్` స్ట్రీమింగ్!!
X
క‌రోనా మ‌హ‌మ్మారీ తెలుగు ప్రేక్ష‌కుల మైండ్ సెట్ ని అమాంతం మార్చేసింద‌ని ప్ర‌చార‌మైంది. ఓటీటీల‌కు అల‌వాటు ప‌డిన జ‌నం థియేట‌ర్ల‌కు వెళ్ల‌ర‌ని భావించారు. కానీ అదంతా ట్రాష్ అని తేలిపోయింది. జ‌నం థియేట‌ర్ల‌కు వెళ్లి చూస్తారు. అలాగే ఓటీటీల్లోనూ వ‌దిలి పెట్ట‌రు అని రుజువ‌వుతోంది.

ఒక‌టికి ప‌దిసార్లు సినిమా వీక్ష‌ణ అల‌వాటు ఉన్న తెలుగు ప్రేక్ష‌కులు దేవుళ్ల‌తో స‌మానం అని పోల్చేది ఇందుకే. సంక్రాంతి సినిమాలతో పాటు వారం వారం రిలీజ‌వుతున్న సినిమాల్ని థియేట‌ర్ల‌కు వెళ్లి చూడ‌టం హోప్ ని పెంచింది. త‌దుప‌రి వ‌రుస‌గా ఓటీటీ రిలీజ్ ల‌కు సిద్ధ‌మ‌వుతున్న వాటి కోసం ఆస‌క్తిగానే వేచి చూస్తున్నారు. క్రైసిస్ నెమ్మ‌దిగా స‌ద్ధుమ‌ణుగుతుండ‌డంతో టాలీవుడ్ పుంజుకుంటోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న‌టించిన `వకీల్ సాబ్` ని థియేట‌ర్ల‌లో వీక్షించాల‌న్న ఆస‌క్తి ఇప్ప‌టికే ప్రేక్ష‌కాభిమానుల మైండ్ లో ఉంది. ఈ చిత్రం 9 ఏప్రిల్ 2021 న తెరపైకి వస్తోంది. అలాగే ఓటీటీతో పాటు శాటిలైట్ డీల్ కూడా ఇప్ప‌టికే పూర్త‌యింది.

ప్ర‌ఖ్యాత ఓటీటీ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ హక్కులను ద‌క్కించుకోగా.. జీసినిమాస్ శాటిలైట్ రైట్స్ ని ద‌క్కించుకుంద‌ని తెలిసింది. ఈ చిత్రం మే చివరి వారంలో ఈ వేదిక‌ల‌పై అందుబాటులోకి వ‌స్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం...థియేటర్ల‌లో విడుదలైన యాభై రోజుల తర్వాతే సినిమా ఓటీటీలోకి వ‌స్తుంది. ఆ మేర‌కు నిర్మాత‌లు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇటీవ‌ల రామ్ న‌టించిన రెడ్ 40రోజుల్లో అందుబాటులోకి వ‌చ్చేసింది. క్రాక్ కూడా త్వ‌ర‌గానే ఓటీటీల్లోకి వ‌చ్చేయ‌గా.. విజ‌య్ న‌టించిన అనువాద చిత్రం మాస్ట‌ర్ కూడా ఓటీటీలోకి కేవ‌లం మూడు వారాల్లోనే వ‌చ్చేసింది. దీంతో డిజిట‌ల్ రిలీజ్ వ్య‌వ‌హారం మ‌రోసారి ఆందోళ‌న‌కు కార‌ణ‌మైంది. ఇక వ‌కీల్ సాబ్ ని కూడా అలా తొంద‌ర‌గా ఓటీటీల్లో వ‌చ్చేయ‌కూడ‌ద‌ని ప‌వ‌ర్ స్టార్ అభిమానులు కోరుకుంటున్నారు. ఆ క్ర‌మంలోనే నిర్మాత‌లు 50 రోజుల నియ‌మాన్ని పాటిస్తున్నార‌ని తెలిసింది.

`వ‌కీల్ సాబ్` చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హసన్ క‌థానాయిక‌. అంజలి- నివేదా థామస్- అనన్య నాగల్ల త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దిల్ రాజు- బోనీక‌పూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.