Begin typing your search above and press return to search.

నాని దర్శకుడు.. దేవరకొండ మరో పాన్ ఇండియా?

By:  Tupaki Desk   |   24 May 2022 2:30 PM GMT
నాని దర్శకుడు.. దేవరకొండ మరో పాన్ ఇండియా?
X
లైగర్ సినిమాతో మొదటి సారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న విజయ్ దేవరకొండ ఎలాగైనా ఆ సినిమాతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని ఆశపడుతున్నాడు. తప్పకుండా లైగర్ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో కూడా ఉన్నాడు. పూరి జగన్నాథ్ కూడా ఆ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసినట్లు అనిపించింది. ఎందుకంటే ఆ సినిమా స్క్రిప్ట్ కోసమే దర్శకుడు చాలా టైం తీసుకున్నాడు. ఇక లైగర్ సినిమా షూటింగ్ అనంతరం వెనువెంటనే విజయ్ దేవరకొండ మరో రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు.

పూరి జగన్నాథ్ జనగణమన అనే మరొక పాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ఖుషి అనే సినిమాను కూడా విజయ్ మొదలుపెట్టాడు. ఈ లైనప్ లో విజయ్ దేవరకొండ మరొక దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ దర్శకుల్లో ఒకరైన మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి తో కూడా ఓ సినిమా చేసేందుకు రౌడీ స్టార్ ఒప్పుకున్నట్లు సమాచారం.

వీరి కలయికలో రాబోయే సినిమా కూడా ఫ్యాన్ ఇండియా మార్కెట్ కి తగ్గట్టుగానే తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఆ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్లు సమాచారం. మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఇదివరకే నానితో అష్టా చమ్మా, జెంటిల్ మెన్ సినిమాలతో మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. కానీ చివరగా అతను డైరెక్ట్ చేసిన V బ్సినిమా మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమా ఓటీటీ లో మంచి ధరకు అమ్ముడైనప్పటికీ ఆడియన్స్ నుంచి మాత్రం నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగానే అందుకుంది. అయినప్పటికీ దిల్ రాజు ఆ దర్శకుడికి మరో అవకాశం ఇవ్వాలని విజయ్ దేవరకొండ డేట్స్ దక్కించుకొని మరో సినిమా చేసేందుకు అవకాశం ఇచ్చాడు. ఇప్పటికే కథపై హీరో కూడా సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.