Begin typing your search above and press return to search.

ప్రభాస్ అలాంటి సాహసం చేయబోతున్నాడా...?

By:  Tupaki Desk   |   15 July 2020 10:50 AM GMT
ప్రభాస్ అలాంటి సాహసం చేయబోతున్నాడా...?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్లో 21వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తుండగా.. ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలతో పాటు అవార్డులను కూడా పొందాడు. దీంతో ప్రభాస్ చిత్రాన్ని కూడా నాగ్ అశ్విన్ అదే స్థాయిలో అద్భుతంగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే గత రికార్డులను తిరగరాసేలా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి.

కాగా ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ప్రభాస్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. ఇదే కనుక నిజమైతే ప్రభాస్ కెరీర్ లో ద్విపాత్రాభినయం చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. అంతేకాకుండా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఉండబోతున్న ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ను హైదరాబాద్ లోనే వేయబోతున్నారట. అందుకోసమే నిర్మాతలు సినిమాకు దాదాపు 400 కోట్ల వరకు బడ్జెట్ ను ప్లాన్ చేస్తున్నారట. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయట. 'సాహో' కోసం బాలీవుడ్ బ్యూటీని తీసుకొచ్చిన ప్రభాస్ ఈ సినిమాకి కూడా బాలీవుడ్ నుండే తీసుకురావాలని ప్లాన్స్ చేస్తున్నారట.

ఇదిలావుండగా ఇప్పటి దాకా పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న ప్రభాస్ ఈ సినిమాతో పాన్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారబోతున్నాడు. దేశ విదేశాల్లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విదేశీ భాషల్లో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లి 2022 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' షూటింగ్ ఆగస్టు మొదటి వారంలో పునప్రారంభం కాబోతోందని సమాచారం.