Begin typing your search above and press return to search.

చెర్రీ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్.. రేపే #RC16 ప్రకటన..?

By:  Tupaki Desk   |   14 Oct 2021 5:39 PM GMT
చెర్రీ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్.. రేపే #RC16 ప్రకటన..?
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో 'ఆచార్య'.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాలను పూర్తి చేశారు. ఇటీవలే శంకర్ దర్శకత్వంలో #RC15 మూవీని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలుపెట్టారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చరణ్ మరో కొత్త ప్రాజెక్ట్ ని లాక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

రామ్ చరణ్ నటించే 16వ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటనకు సమయం ఆసన్నమైందని సోషల్ మీడియా చెబుతోంది. దసరా పండుగను పురస్కరించుకుని రేపు శుక్రవారం #RC16 అనౌన్స్ మెంట్ రాబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 'జెర్సీ' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది.

ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని.. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద వంశీ - ప్రమోద్ నిర్మించనున్నారని చెప్పుకుంటున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో.. యూవీ టీమ్ తో చరణ్ సినిమా చేస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. 'జెర్సీ' హిందీ రీమేక్ ని కంప్లీట్ చేసిన గౌతమ్.. మెగా వారసుడిని తన స్టోరీతో మెప్పించారని తెలుస్తోంది. ఇదొక థ్రిల్లర్ మూవీ అని టాక్. రేపు #RC16 అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేది నిజమే అయితే.. అన్ని విషయాల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇకపోతే కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ - చిరంజీవి కలసి నటించిన 'ఆచార్య' సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న రిలీజ్ కానుంది. రాజమౌళి తో చేసిన RRR 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ డైరెక్ట్ చేసిన 'జెర్సీ' సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల అవుతుంది. ఇక యూవీ క్రియేషన్స్ వారు 'రాధే శ్యామ్' చిత్రాన్ని సంక్రాంతి కి రెడీ చేస్తున్నారు. ఇటీవలే ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబోలో 'స్పిరిట్' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.