Begin typing your search above and press return to search.

కరోనా మూల్యం:కనికాకపూర్ పై మరో రెండు కేసులు..

By:  Tupaki Desk   |   9 April 2020 10:50 AM GMT
కరోనా మూల్యం:కనికాకపూర్ పై మరో రెండు కేసులు..
X
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఇటీవలే కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంది. లండన్ నుంచి వచ్చిన ఆమెకు కరోనా సోకినా పెడచెవిన పెట్టి స్టార్ హోటల్స్ లో దిగి హల్ చల్ చేసింది. పలువురికి వ్యాధి అంటించింది. కనికా దేశంలో దిగాక చాలా మంది రాజకీయ - సినీ ప్రముఖులను కలిసింది. పలు విందులు - కార్యక్రమాల్లో పాల్గొంది. కనికాకు కరోనా లక్షణాలున్నా పెడచెవిన పెట్టి ఇలా క్వారంటైన్ లో ఉండకుండా తిరిగినందుకు అప్పట్లోనే ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.

కనికాకపూర్ కు కరోనా లక్షణాలు బయటపడ్డాక యూపీలోని లక్నో సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీలో ఉంచి చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బందితో కూడా కనిక గొడవపడింది. అప్పుడు ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు కనికా కోలుకున్నా కేసులు మాత్రం ఆమెను వీడడం లేదు.. గుదిబండగా తయారయ్యాయి.

కనికా వ్యవహారంపై లక్నో డీఎస్పీ దినేష్ కుమార్ స్పందించారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు కనికా కపూర్ పై కేసు నమోదు చేశామన్నారు. ఇక ఇదే కాదు.. ఆమె కరోనా ఉన్నా నిర్లక్ష్యంగా తిరిగినందుకు తాజాగా హజ్రత్ గంజ్ - గోమతినగర్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి.

దీంతో మూడు కేసుల్లో కనికా కపూర్ ను అరెస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం కనికా కపూర్ 14 రోజుల గృహ నిర్బంధంలో ఉన్నారు. అది ముగిశాక అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. దీంతో కరోనా నుంచి బయటపడిన కనికా ఇప్పుడు కేసుల నుంచి ఎలా బయటపడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆమె దుందుడుకు స్వభావమే ఆమె కొంపముంచిందన్న వాదన ఉంది.