Begin typing your search above and press return to search.

కరోనాని కేర్ చేయమంటున్న టాలీవుడ్ స్టార్ హీరోలు...!

By:  Tupaki Desk   |   20 Sep 2020 9:30 AM GMT
కరోనాని కేర్ చేయమంటున్న టాలీవుడ్ స్టార్ హీరోలు...!
X
కరోనా నేపథ్యంలో ఆగిపోయిన సినిమా షూటింగ్స్ అన్నీ ఒక్కొక్కటిగా తిరిగి ప్రారంభమవుతున్నాయి. షూటింగులకు ప్రభుత్వం అనుమతించడంతో ఇప్పటికే పలు సినిమాలు చిత్రీకరణ స్టార్ట్ చేసాయి. ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు చిన్న హీరోలే సెట్స్ లో అడుగుపెట్టగా.. ఇప్పుడు స్టార్ హీరోలు సైతం కరోనా ని కేర్ చేయకుండా షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ హీరో టాలీవుడ్ కింగ్ నాగార్జున 'వైల్డ్ డాగ్' మూవీ కోసం సెట్స్ లో అడుగుపెట్టేసాడు. 'బిగ్ బాస్' రియాలిటీ షో షూట్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇప్పుడు నాగ్ బాటలోనే మరికొంత మంది స్టార్ హీరోలు నడవడానికి రెడీ అయ్యారు. నిజానికి పెద్ద హీరోలే షూటింగ్స్ స్టార్ట్ చేద్దామని నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే 'రాధే శ్యామ్' షూట్ లో పాల్గొంటారని డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' ను నవంబ‌ర్ నుంచి విదేశాల్లో షురూ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులు పూర్తి చేయాల్సిందిగా డైరెక్టర్ పరశురామ్ కు మ‌హేశ్ స్ప‌ష్టం చేసిన‌ట్లుగా సమాచారం. మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' షూటింగ్ వచ్చే నెలలో తిరిగి ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే దీని కోసం సెట్స్ నిర్మాణం పూర్తి చేసే పనిలో ఉన్నారని సమాచారం. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విక్టరీ వెంకటేష్ 'నార‌ప్ప' మిగతా షూటింగ్ కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుగా కరోనా నేపథ్యంలో షూటింగ్ లో ఇప్పట్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నప్పటికీ.. సినిమా షూటింగ్స్ స్టార్ట్ అయితే ఇన్ని రోజులు నానా అవస్థలు పడుతూ వస్తున్న సినీ కార్మికులకు పని లభించే అవకాశం ఉందని భావించి సెట్స్ లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే నిర్మాత‌లు అంద‌రికీ సెట్స్ వేసుకొని రెడీగా ఉండ‌మ‌ని ఆర్డర్స్ ఇచ్చేశాడట. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప' కోసం ఇప్పటికే లొకేషన్స్ రెడీ చేసుకున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వ‌చ్చే నెల నుంచి 'పుష్ప' మొద‌లయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక 'ఆర్.ఆర్.ఆర్' హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ షూటింగ్స్ పాల్గొనడానికి ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే హీరోలు షూటింగ్ కోసం ప్రిపరేషన్ చేసుకుంటున్నారు. రాజమౌళి నుంచి పిలుపు వచ్చిన వెంటనే సెట్స్ లో వాలిపోతారని తెలుస్తోంది.

అంతేకాకుండా బాలయ్య - బోయపాటి శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మూవీ షూటింగ్ ఈ నెలాఖ‌రు నుంచి లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి రీ స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నారట. మాస్ మహారాజా రవితేజ్ 'క్రాక్' షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది. అక్కినేని నాగచైతన్య - శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'లవ్ స్టోరీ' షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇక యువ హీరోల్లో నాగశౌర్య తన న్యూ ప్రాజెక్ట్ కోసం సెట్స్ లో అడుగుపెట్టేసాడు. అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' షూటింగ్ స్టార్ట్ చేసేసాడు. అలానే నిఖిల్ సిద్దార్థ్ 'కార్తికేయ 2' కూడా అక్టోబ‌ర్ లో మొద‌ల‌వ్వ‌నుందని సమాచారం. ఏదేమైనా కరోనా నేప‌థ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోలందరూ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ తక్కువ మంది సిబ్బందితో షూట్ చేయడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది.