Begin typing your search above and press return to search.
దసరా రోజు మెగా ఫ్యాన్స్ కు అతి పెద్ద న్యూస్ ఇదే!
By: Tupaki Desk | 15 Oct 2021 6:17 AM GMTదసరా పండుగ సందర్బంగా టాలీవుడ్ నుండి చాలా అప్ డేట్స్ వచ్చాయి. స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు చాలా మంది సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వస్తున్నాయి. ఎన్ని అప్ డేట్స్ వచ్చినా కూడా మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యే అప్ డేట్ ఎట్టకేలకు వచ్చింది. చాలా రోజులుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రిలో ఉన్నాడు. బైక్ యాక్సిడెంట్ కు గురి అయిన సాయి ధరమ్ తేజ్ అప్పటి నుండి అపోలో ఆసుపత్రిలో ఉన్నాడు. ఎట్టకేలకు ఆసుపత్రి నుండి సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయాన్ని మెగా కుటుంబీకులు అధికారికంగా ప్రకటించారు.
యాక్సిడెంట్ చిన్నదే అంటూ చెబుతూనే మరో వైపు ఇప్పటి వరకు కూడా ఆసుపత్రిలోనే ఉండటం చర్చనీయాంశం అయ్యింది. సాయి ధరమ్ తేజ్ కు సంబంధించినంత వరకు ఏదో విషయాన్ని కుటుంబ సభ్యులు మరియు ఆసుపత్రి వర్గాల వారు దాస్తున్నారనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. అంతా బాగనే ఉంటే ఎందుకు సాయి ధరమ్ తేజ్ ఇంకా ఆసుపత్రిలో ఉన్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎట్టకేలకు సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్ సందర్బంగా కూడా కనీసం ఆసుపత్రి బెడ్ నుండి అయినా సాయి ధరమ్ తేజ్ మాట్లాడలేదు. దాంతో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎట్టకేలకు సాయి ధరమ్ తేజ్ ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లుగా ప్రకటించడంతో మెగా అభిమానులు దసరా సందర్బంగా అతి పెద్ద గుడ్ న్యూస్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత ఎలా ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేయడానికి ఒక ఫొటోను విడుదల చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది ఎప్పుడు అయ్యేనో చూడాలి.
యాక్సిడెంట్ చిన్నదే అంటూ చెబుతూనే మరో వైపు ఇప్పటి వరకు కూడా ఆసుపత్రిలోనే ఉండటం చర్చనీయాంశం అయ్యింది. సాయి ధరమ్ తేజ్ కు సంబంధించినంత వరకు ఏదో విషయాన్ని కుటుంబ సభ్యులు మరియు ఆసుపత్రి వర్గాల వారు దాస్తున్నారనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. అంతా బాగనే ఉంటే ఎందుకు సాయి ధరమ్ తేజ్ ఇంకా ఆసుపత్రిలో ఉన్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎట్టకేలకు సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్ సందర్బంగా కూడా కనీసం ఆసుపత్రి బెడ్ నుండి అయినా సాయి ధరమ్ తేజ్ మాట్లాడలేదు. దాంతో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎట్టకేలకు సాయి ధరమ్ తేజ్ ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లుగా ప్రకటించడంతో మెగా అభిమానులు దసరా సందర్బంగా అతి పెద్ద గుడ్ న్యూస్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత ఎలా ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేయడానికి ఒక ఫొటోను విడుదల చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది ఎప్పుడు అయ్యేనో చూడాలి.