Begin typing your search above and press return to search.

క‌రోనా దెబ్బ‌కు ఆసియా వ‌దిలేశారు

By:  Tupaki Desk   |   20 Feb 2020 8:30 PM GMT
క‌రోనా దెబ్బ‌కు ఆసియా వ‌దిలేశారు
X
క‌రోనా దెబ్బ‌కు ప్ర‌పంచం గ‌జ‌గ‌జ‌లాడిపోతున్న సంగ‌తి తెలిసిందే. చైనాకు ప్ర‌యాణాలు బంద్ అయిపోయాయి. చైనా- భార‌త్ కి చుట్టూ ఉన్న శీత‌ల దేశాల‌కు ఎవ‌రూ వెళ్ల‌డం లేదు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఆసియా దేశాల‌కు రావాలన్నా పోవాల‌న్నా భ‌యంతో చ‌స్తున్నారు. ఇక సినిమావాళ్ల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంది. చైనా.. థాయ్ ల్యాండ్ .. బ్యాంకాక్ ఎక్క‌డికీ మ‌నోళ్లు వెళ్ల‌డం లేదు. అన్ని షూటింగుల్ని వాయిదాలు వేసేశారు. ఇదొక్క‌టేనా చ‌ల్ల‌గా ఉండే దేశాల‌కు అస‌లే వెళ్ల‌డం లేదు. వైర‌స్ మ‌హ‌మ్మారీ ఎట్నుంచి వ‌చ్చి చుట్టేస్తుందోన‌న్న భ‌యం వెంటాడుతోంది.

దీంతో కాస్త వేడిగా ఉండే మిడిల్ ఈస్ట్ .. ఆఫ్రిక‌న్ దేశాల మీద ప‌డుతున్నార‌ట‌. షూటింగుల పేరుతో ఆయా దేశాల‌కు తాకిడి పెరిగింద‌ని చెబుతున్నారు. నాగార్జున - బన్ని లాంటి హీరోల సినిమాల్ని ఇప్ప‌టికే వాయిదా వేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న నాగ‌చైత‌న్య `లవ్ స్టోరీ` స‌న్నివేశ‌మేంటి? అంటే ... వీళ్ల‌కు కూడా క‌రోనా భ‌యం ప‌ట్టుకుంద‌ట‌.

దీంతో చిత్ర‌ బృందం కీలక షెడ్యూల్ కోసం దుబాయ్ కి షిఫ్ట‌వుతున్నార‌ట‌. ఫిబ్రవరి 21 నుంచి అక్క‌డ‌ షెడ్యూల్ లో కొన్ని పాటలు .. కీల‌క‌సన్నివేశాలు చిత్రీకరించ‌నున్నారు. ఈ నెలాఖ‌రువ‌ర‌కూ షెడ్యూల్ ఉంటుంద‌ట‌. నాగ చైతన్య- సాయి పల్లవి జంట‌గా న‌టిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా కి సంబంధించిన ఏ పిల్లా పాట టీజర్ ప్రేమికుల రోజున రిలీజై ఆక‌ట్టుకుంది. క‌మ్ముల మ‌రోసారి మ్యాజిక్ చేయ‌బోతున్నాడ‌నే అర్థ‌మైంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి - అమిగోస్ క్రియేషన్స్ (క‌మ్ముల) బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వేసవిలో మూవీ రిలీజ్ కి రానుంది.