Begin typing your search above and press return to search.
దర్శకుడి వారసుడి ఎంట్రీ మూవీలో నవనాయికలు
By: Tupaki Desk | 25 Oct 2020 10:30 AM GMTజాతీయ అవార్డు గ్రహీత సతీష్ వేగేష్న తన కుమారుడు సమీర్ వెగెస్నాను హీరోగా పరిచయం చేయనున్నారని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. కోతి కొమ్మచ్చి పేరుతో సినిమా వివరాలు వెల్లడయ్యాయి. ఈ చిత్రంలో ఐకానిక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీహరి కుమారుడు మేఘంష్ శ్రీహరి ప్రధాన పాత్రలో నటిస్తున్నారని ఇదివరకూ వార్తలొచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో ఇద్దరు యువ బ్యూటీలు నటించనున్నారని తెలుస్తోంది. రాధే శ్యామ్ నటి రిద్ధి కుమార్ .. అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్ లో నటించిన ఆదిత్య వర్మ ఫేమ్ మేఘా చౌదరిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇద్దరు భామలు ఇద్దరు హీరోల కోసం ఎంపికయ్యారని సమాచారం.
ప్రముఖ సంగీత స్వరకర్త అనూప్ రూబెన్స్ `కోతి కొమ్మచ్చి` కోసం సౌండ్ ట్రాక్ లు రెడీ చేయనున్నారు. విజయ దశమి శుభ సందర్భంగా ఈ చిత్రం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. వేగేష్న సతీష్ తెరకెక్కించిన శతమానం భవతి చిత్రానికి జాతీయ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా ఆయన శ్రీనివాస కళ్యాణం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారసుడిని హీరోగా ప్రమోట్ చేసే బాధ్యతల్లో వేగేష్న బిజీగా ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో ఇద్దరు యువ బ్యూటీలు నటించనున్నారని తెలుస్తోంది. రాధే శ్యామ్ నటి రిద్ధి కుమార్ .. అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్ లో నటించిన ఆదిత్య వర్మ ఫేమ్ మేఘా చౌదరిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇద్దరు భామలు ఇద్దరు హీరోల కోసం ఎంపికయ్యారని సమాచారం.
ప్రముఖ సంగీత స్వరకర్త అనూప్ రూబెన్స్ `కోతి కొమ్మచ్చి` కోసం సౌండ్ ట్రాక్ లు రెడీ చేయనున్నారు. విజయ దశమి శుభ సందర్భంగా ఈ చిత్రం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. వేగేష్న సతీష్ తెరకెక్కించిన శతమానం భవతి చిత్రానికి జాతీయ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా ఆయన శ్రీనివాస కళ్యాణం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారసుడిని హీరోగా ప్రమోట్ చేసే బాధ్యతల్లో వేగేష్న బిజీగా ఉన్నారు.