Begin typing your search above and press return to search.

అఖండతో జాక్ పాట్ కొట్టిన ఓటీటీ సంస్థ

By:  Tupaki Desk   |   3 Dec 2021 3:30 PM GMT
అఖండతో జాక్ పాట్ కొట్టిన ఓటీటీ సంస్థ
X
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనుల కాంబోలో వచ్చిన మూడో సినిమా అఖండ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాను అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ హిట్‌ బ్లాక్ బస్టర్‌ హిట్‌ అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. సింహా.. లెజెండ్‌ ల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా అఖండను బోయపాటి శ్రీను తెరకెక్కించాడని కామెంట్స్ వస్తున్నాయి. ఇద్దరి కాంబోకు ఇది హ్యాట్రిక్ అంటూ అభిమానులు కీర్తిస్తున్నారు. ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు భారీగా ఉన్నాయి. సెకండ్‌ వేవ్‌ తర్వాత వచ్చిన సినిమాల్లో ఇదే భారీ విజయం సాధించిన సినిమాగా నిలిచిందంటూ ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌.. ఆస్ట్రేలియా.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ప్రతి చోట కూడా అఖండ విజయంను దక్కించుకుంది.

ఇక ఈ సినిమా ను విడుదలకు ముందే డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్ వారు స్ట్రీమింగ్‌ హక్కులు కొనుగోలు చేయడం జరిగింది. సినిమాకు వచ్చిన బజ్ నేపథ్యంలో మంచి రేటుకే డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ వారు కొనుగోలు చేయడం జరిగింది. అయితే బాలయ్య సినిమాకు అంత ఎందుకు అంటూ కొందరు విడుదలకు ముందు కామెంట్స్ చేశారు. కాని ఇప్పుడు వారే డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వారు లక్కీ అంటున్నారు. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన ఈ సినిమా హాట్ స్టార్‌ లో ముందు ముందు మారు మ్రోగి పోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తో హాట్‌ స్టార్‌ వారు కచ్చితంగా జాక్ పాట్‌ కొట్టినట్లే అంటూ ఓటీటీ విశ్లేషకులు కూడా అంటున్నారు.

అఖండ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలో నటించి మెప్పించారు. బాలయ్య కు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ నటించగా పూర్ణ.. జగపతిబాబు.. శ్రీకాంత్‌ ఇంకా ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో కనిపించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అంచనాలను నిలుపుకుంది. బాలయ్య సినిమా అంటే అభిమానులు ఏం ఆశిస్తారో ఈ సినిమా లో అదే బోయపాటి చూపించాడు. ప్రస్తుతం జనాలు థియేటర్‌ వెంట అఖండ కోసం పరుగులు తీస్తున్నారు. మరి కొందరు మాత్రం అప్పుడే అఖండ ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడు అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే అఖండ వంటి భారీ యాక్షన్‌ మాస్ సినిమా ను థియేటర్ లో చూస్తేనే ఫీల్ ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.