Begin typing your search above and press return to search.

సంక్రాంతి తర్వాత బాక్స్ ఆఫీస్ ను నీరుగార్చిన సినిమాలు!

By:  Tupaki Desk   |   10 Feb 2020 1:30 AM GMT
సంక్రాంతి తర్వాత బాక్స్ ఆఫీస్ ను నీరుగార్చిన సినిమాలు!
X
ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీసుకు నిజమైన పండగ తీసుకొచ్చిందనేది వాస్తవం. పోటీ ఎలా ఉంది.. ఏది హిట్టు ఏది సూపర్ హిట్టు అనేది పక్కన పెడితే మహేష్ బాబు.. అల్లు అర్జున్ సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. ఇద్దరూ బడా స్టార్లు కావడంతో ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టించారు. భారీ కలెక్షన్స్ నమోదు చేసి సందడి తీసుకొచ్చారు. అయితే సంక్రాంతి పండగ హడావుడి పూర్తి కాగానే బాక్స్ ఆఫీసు వెలవెలబోతోందని ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి.

సంక్రాంతి సీజన్ తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో మాస్ మహారాజా 'డిస్కోరాజా'.. నాగశౌర్య కొత్త సినిమా 'అశ్వథ్థామ' సినిమాలు చెప్పుకోదగ్గవి. ఈ సినిమాల ఫలితం అందరికీ తెలిసిందే. ఇక వీటితో పాటు పలు స్మాల్ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యాయి కానీ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో విడుదల అయిన సినిమాల పరిస్థితి కూడా మహా నీరసంగా ఉంది. సమంతా-శర్వానంద్ లు నటించిన 'జాను' కలెక్షన్స్ చూస్తుంటే హిట్ దిశగా పయనించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ సినిమాతో పాటుగా రిలీజ్ అయిన చిన్న సినిమాలు 'సవారి'.. '3 మంకీస్' లాంటి సినిమాలకు కూడా పెద్దగా స్పందన దక్కలేదు.

సంక్రాంతి తర్వాత ఇప్పటి వరకూ రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క సినిమా కూడా మంచి కలెక్షన్స్ నమోదు చెయ్యలేకపోయింది. నిజానికి ఫిబ్రవరి మార్చ్ నెలలను టాలీవుడ్ కు అన్ సీజన్ గా పరిగణిస్తారు. పరిక్షల సమయం దగ్గరపడడంతో సినిమాలకు యూత్ కాస్త దూరంగా ఉంటుంది. అయితే ఈ నెలలో రిలీజ్ కానున్న కొత్త సినిమాలపై ట్రేడ్ లో ఆసక్తి నెలకొంది. వాటిలో ముఖ్యంగా తెలంగాణా మెగా స్టార్.. తెలంగాణా పవర్ స్టార్ ల పైనే ఆశలన్నీ ఉన్నాయి. వారెవరు అని అడక్కండి. ఒకరు విజయ్ దేవరకొండ.. మరొకరు నితిన్. మరి ఈ ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీసుకు సందడి తీసుకొస్తారేమో చూడాలి.