Begin typing your search above and press return to search.
ప్రిన్స్ మహేష్ వరల్డ్ రికార్డ్.. ఏ ఇండస్ట్రీలోనూ ఇలా జరగలేదు!
By: Tupaki Desk | 25 Jan 2021 5:00 AM GMTటాలీవుడ్ లో టాప్ హీరోగా వెలుగొందుతోన్నాడు సూపర్ స్టార్ మహేష్. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ప్రిన్స్. ప్రయోగాలకు కూడా వెనకడుగు వేయకుండా.. ప్రతీ సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. కాగా.. లేటెస్ట్ గా మహేష్ పేరిట ప్రపంచ రికార్డు నమోదైంది. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారిగా నమోదైన ఆ రికార్డు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి మహేష్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. టైటిల్ పోస్టర్ కు ఫుల్ క్రేజ్ రావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
బ్యాంకులకు టోకరా వేసి విదేశాలకు పారిపోతున్న వ్యాపారవేత్తలను టార్గెట్ చేసే కథ ఇది. వాస్తవానికి ఈ సినిమా గతంలోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇటీవలే చిత్ర యూనిట్ దుబాయ్ చేరుకుంది. నమ్రత బర్త్ డే వేడుకలను కూడా దుబాయ్ లో ప్లాన్ చేసిన మహేష్.. అక్కడే ఉన్నడు. ఈ క్రమంలో సోమవారం నుంచి ‘సర్కారు వారి పాట’ షురూ కానుందని సమాచారం. దుబాయ్లో జరుగుతున్న మొదటి షెడ్యూల్లో హీరో, హీరోయిన్లపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న మహేష్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నైజాం ఏరియాలో అతడి సినిమాలు భారీగా కలెక్షన్లు సాధిస్తున్నాయి. దీంతో ‘సర్కారు వారి పాట' నైజాం రైట్స్కు డిమాండ్ ఏర్పడింది. ఈ హక్కుల కోసం ఏకంగా రూ. 40 కోట్లు చెల్లించేందుకు పలువురు డిస్ట్రిబ్యూటర్స్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
అయితే.. ప్రారంభం కాకుండానే.. ‘సర్కారు వారి పాట’ వరల్డ్ రికార్డు సాధించింది. మహేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ సంచలనం సృష్టించారు. అదేమంటే.. కొద్ది రోజులుగా మహేశ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో #SarkaruVaariPaata అనే హ్యాష్ ట్యాగ్ను జోడిస్తూ ట్వీట్లు చేయడం ప్రారంభించారు. చాలా రోజులుగా ట్రెండింగ్ లో ఉన్న ఈ ట్యాగ్.. ఏకంగా వంద మిలియన్లకు పైగా ట్వీట్లను అందుకుంది. గతంలో ఏ పరిశ్రమకు చెందిన సినిమా కూడా ఈ మైలురాయిని చేరుకోలేదు. ఈ విధంగా.. విడుదలకు ముందే ‘సర్కారు వారి పాట' ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మరి, రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి సంచలనం నమోదు చేస్తుందో చూడాలి.
ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి మహేష్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. టైటిల్ పోస్టర్ కు ఫుల్ క్రేజ్ రావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
బ్యాంకులకు టోకరా వేసి విదేశాలకు పారిపోతున్న వ్యాపారవేత్తలను టార్గెట్ చేసే కథ ఇది. వాస్తవానికి ఈ సినిమా గతంలోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇటీవలే చిత్ర యూనిట్ దుబాయ్ చేరుకుంది. నమ్రత బర్త్ డే వేడుకలను కూడా దుబాయ్ లో ప్లాన్ చేసిన మహేష్.. అక్కడే ఉన్నడు. ఈ క్రమంలో సోమవారం నుంచి ‘సర్కారు వారి పాట’ షురూ కానుందని సమాచారం. దుబాయ్లో జరుగుతున్న మొదటి షెడ్యూల్లో హీరో, హీరోయిన్లపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న మహేష్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నైజాం ఏరియాలో అతడి సినిమాలు భారీగా కలెక్షన్లు సాధిస్తున్నాయి. దీంతో ‘సర్కారు వారి పాట' నైజాం రైట్స్కు డిమాండ్ ఏర్పడింది. ఈ హక్కుల కోసం ఏకంగా రూ. 40 కోట్లు చెల్లించేందుకు పలువురు డిస్ట్రిబ్యూటర్స్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
అయితే.. ప్రారంభం కాకుండానే.. ‘సర్కారు వారి పాట’ వరల్డ్ రికార్డు సాధించింది. మహేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ సంచలనం సృష్టించారు. అదేమంటే.. కొద్ది రోజులుగా మహేశ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో #SarkaruVaariPaata అనే హ్యాష్ ట్యాగ్ను జోడిస్తూ ట్వీట్లు చేయడం ప్రారంభించారు. చాలా రోజులుగా ట్రెండింగ్ లో ఉన్న ఈ ట్యాగ్.. ఏకంగా వంద మిలియన్లకు పైగా ట్వీట్లను అందుకుంది. గతంలో ఏ పరిశ్రమకు చెందిన సినిమా కూడా ఈ మైలురాయిని చేరుకోలేదు. ఈ విధంగా.. విడుదలకు ముందే ‘సర్కారు వారి పాట' ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మరి, రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి సంచలనం నమోదు చేస్తుందో చూడాలి.