Begin typing your search above and press return to search.

'మహేష్ పిన్ పాయింట్ యాక్టర్.. ప్రభాస్ చాలా సెన్సిటివ్'

By:  Tupaki Desk   |   17 Jun 2021 11:30 PM GMT
మహేష్ పిన్ పాయింట్ యాక్టర్.. ప్రభాస్ చాలా సెన్సిటివ్
X
టాలీవుడ్ లో విలన్ గా కెరీర్ ప్రారంభించి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సుబ్బరాజు. ఓవైపు విలనీ పడిస్తూనే మరోవైపు కమెడియన్‌ గా తనదైన శైలి హాస్యం పండించడం ఆయన స్పెషాలిటీ. 'బాహుబలి' సినిమాతో జపాన్ లో కూడా అభిమానులను సంపాదించుకున్న సుబ్బరాజు.. ప్రస్తుతం టాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. స్టార్ హీరోలందరితో కలసి వర్క్ చేసిన ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు - ప్రభాస్ లతో నటించిన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.

మహేష్ తో 'పోకిరి' 'అతిథి' 'ఖలేజా' 'దూకుడు' 'బిజినెస్ మ్యాన్' 'శ్రీమంతుడు' వంటి సినిమాలలో నటించిన సుబ్బరాజు.. మహేష్ ఒక పిన్ పాయింట్ యాక్టర్ అని తెలిపారు. "మహేష్ స్సెన్సిటివ్ గా కనిపిస్తారు కాని అతను ఖచ్చితమైన పిన్ పాయింట్ యాక్టర్. ప్రతిదీ క్రిస్ప్ గా ప్రాపర్ గా ఉండాలని ఆయన కోరుకుంటారు'' అని సుబ్బరాజు అన్నారు. అలానే 'బుజ్జిగాడు' 'మిర్చి' 'బాహుబలి' వంటి చిత్రాలలో కలసి నటించిన ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ''ప్రభాస్ టఫ్ గా కనిపిస్తాడు కానీ చాలా సెన్సిటివ్. ఇన్నోసెంట్. అతనితో పనిచేయడం ఎల్లప్పుడూ సరదాగా ఉంటుంది'' అని అన్నారు.

ఇంతకముందు కూడా ఓ సందర్భంలో మహేష్ గురించి మాట్లాడిన సుబ్బరాజు.. ఆయన సూపర్‌ స్టార్ అయినా ఎంతో కష్టపడతాడని.. అంత స్టార్ స్టాటస్ లో ఉండి కూడా చాలా సాధాసీదాగా ఉంటారని చెప్పారు. సినిమా కోసం ఏమైనా చేసే నటుడు మహేష్ అని.. కేవలం యాక్టింగ్ కే కాదు ఆయన వ్యక్తిత్వాన్ని కూడా ఎంతగానో అభిమానిస్తానని... మహేష్ ఈజ్ ది బెస్ట్ అని.. సోషల్ మీడియా లో సౌత్ లో టాప్ ఫాలోయింగ్ ఉన్న సెలెబ్రిటీ అని సుబ్బరాజు అన్నారు. ప్రస్తుతం మహేష్ హీరోగా చేస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాలో కూడా సుబ్బారాజు నటిస్తున్నారు.