Begin typing your search above and press return to search.

దసరా కోసం పోటీ పడుతున్న స్టార్స్.. ఎవరి రేంజ్ ఎంత?

By:  Tupaki Desk   |   5 Feb 2023 8:00 AM GMT
దసరా కోసం పోటీ పడుతున్న స్టార్స్.. ఎవరి రేంజ్ ఎంత?
X
బాలయ్య మళ్లీ ​ వస్తన్నాడు.. పవర్​స్టార్ రెడీ అవుతున్నాడు... మహేశ్​బాబు-రవితేజ-విజయ్​దేవరకొండ కూడా మేము సైతం అంటున్నారు... ఎక్కడికి, ఎందుకు అనుకుంటున్నారా? ఈ ఏడాది థియేటర్లలో దసరా పండగకి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైపోతున్నారు. అసలే సినీ ఇండిస్ట్రీలో సంక్రాంతి తర్వాత ఎదురుచూస్తే మరో పెద్ద పండగ దసరా. ప్రతి ఏటాఈ పండగ వచ్చిందంటే చాలు.. టాలీవుడ్​ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్​లో సందడి ఉంటుందో తెలిసిన విషయమే. ఇక బాక్సాఫీక్​ మరోసారి ఫైట్​కు రంగం సిద్ధమవుతోంది. స్టార్ హీరోలంతా రంగంలోకి దిగబోతున్నారు. అయితే అందరూ వస్తారనే నమ్మకం లేదు. కానీ క్లాష్ సెట్ అయితే మాములుగా ఉండదు.

ఆ చిత్రాలు ఏంటంటే.. పవన్‌ కల్యాణ్‌ హీరోగా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం దసరాకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ సరసన నిధి అగర్వాల్‌ నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలకానుంది.

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు -త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా SSMB 28. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇంకా సెట్స్​పైకి వెళ్లని ఈ చిత్ర ప్రీ బిజినెస్.. నాన్​ థియేట్రికల్​ హక్కులు రూ.300కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని మేకర్స్​ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇకపోతే మహేశ్‌ సరసన పూజా హెగ్డే నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది.

స్టార్ హీరోయిన్ సమంత - సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ఖుషి. . శివ నిర్వాణ దర్శకుడు. ఇప్పటికే 60 శాతంపైగా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లలో విడుదలవుతోందా అని ఎదురుచూస్తున్నారు. ఓ కొత్త తరహా ప్రేమ కథతో వినోదాత్మకంగా సాగే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఇది కూడా దసరాకే రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే వీరసింహారెడ్డితో సూపర్ హిట్​ను అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ ఎన్​బీకే 108కోసం సిద్ధమవుతున్నారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి దీన్ని తెరకెక్కిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఫాదర్​ అండ్ డాటర్​ సెంటిమెంట్​తో రాబుతున్న ఈ సినిమాను కూడా దసరాకే విడుదల చేయాలని ఆలోచిస్తున్నారుట. దీనికి సంగీతం తమన్‌ అందిస్తున్నారు.

స్టూవర్ట్‌పురం దొంగగా పేరుగాంచిన టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. మాస్​ మహారాజా రవితేజ కథానాయకుడు. నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాత. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పకులు. హిందీ నటుడు అనుపమ్‌ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రవితేజ నటిస్తున్న ఈ పాన్ ఇండియ సినిమాను కూడా దసరాకే రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.