Begin typing your search above and press return to search.
ఆ సినిమా దెబ్బకు మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు!
By: Tupaki Desk | 12 Aug 2020 4:15 AM GMTకెరీర్ లో ఎన్నో కమర్షియల్ హిట్ చిత్రాల్లో నటించింది కత్రిన కైఫ్. 35 ప్లస్ లోనూ 20 మైనస్ బ్యూటీలా నవనవలతో మత్తెక్కిస్తున్న క్యాట్ ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ హీట్ పెంచేస్తూనే ఉంది. నవతరం కథానాయికలకు ధీటైన పోటీనిస్తూ తన స్టార్ డమ్ ని ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతున్న కత్రిన మరో ఐదేళ్లలోనే రెండు దశాబ్ధాల కెరీర్ ని పూర్తి చేసుకుంటుంది.
ఇప్పటికే 15 ఏళ్ల కెరీర్ జర్నీ పూర్తయింది. కత్రినా కైఫ్ తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన మల్లీశ్వరి అనే చిత్రంలో నటించింది. త్రివిక్రమ్ మాటల మాయాజాలంతో ఆ సినిమా ఘనవిజయం సాధించింది. కత్రిన అందాలకు తెలుగు యువత ఫిదా అయిపోయారు. అటుపైనా టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ సరసన అల్లరి పిడుగు చిత్రంలో నటించింది. అదే తనకు తెలుగులో చిట్టచివరి సినిమా. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇటువైపు చూడనేలేదు. ప్రస్తుతం బాలీవుడ్ సైతం తెలుగు చిత్రసీమ వైపు చూస్తోంది. మన హిట్ సినిమాల రీమేక్ ల కోసం తపన పడుతున్న సంగతి తెలిసిందే.
ఇక కత్రిన ప్రస్తుత కెరీర్ సంగతి చూస్తే.. పలు హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవల హారర్ మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. తనకు ఎంతో ఇష్ట సఖుడు అయిన యూరి ఫేం విక్కీ కౌశల్ తో ప్రేమాయణం సాగిస్తూనే అతడి సరసన నటించేందుకు ఆసక్తిని చూపిస్తోందని కథనాలొస్తున్నాయి. పనిలోపనిగా తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ సరసన `టైగర్` సిరీస్ సినిమాలతో దుమ్ము దులిపేస్తోంది. ఏక్ థా టైగర్ .. టైగర్ జిందా హై చిత్రాల్లో సల్మాన్ - కత్రిన జోడీ నటించారు. అవి రెండూ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో మూడో సినిమాకి సన్నాహకాల్లో ఉన్నారు. ఇందులోనూ కత్రిన యాక్షన్ క్వీన్ గా కనిపించనుందట. 2021 ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం.
ఇప్పటికే 15 ఏళ్ల కెరీర్ జర్నీ పూర్తయింది. కత్రినా కైఫ్ తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన మల్లీశ్వరి అనే చిత్రంలో నటించింది. త్రివిక్రమ్ మాటల మాయాజాలంతో ఆ సినిమా ఘనవిజయం సాధించింది. కత్రిన అందాలకు తెలుగు యువత ఫిదా అయిపోయారు. అటుపైనా టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ సరసన అల్లరి పిడుగు చిత్రంలో నటించింది. అదే తనకు తెలుగులో చిట్టచివరి సినిమా. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇటువైపు చూడనేలేదు. ప్రస్తుతం బాలీవుడ్ సైతం తెలుగు చిత్రసీమ వైపు చూస్తోంది. మన హిట్ సినిమాల రీమేక్ ల కోసం తపన పడుతున్న సంగతి తెలిసిందే.
ఇక కత్రిన ప్రస్తుత కెరీర్ సంగతి చూస్తే.. పలు హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవల హారర్ మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. తనకు ఎంతో ఇష్ట సఖుడు అయిన యూరి ఫేం విక్కీ కౌశల్ తో ప్రేమాయణం సాగిస్తూనే అతడి సరసన నటించేందుకు ఆసక్తిని చూపిస్తోందని కథనాలొస్తున్నాయి. పనిలోపనిగా తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ సరసన `టైగర్` సిరీస్ సినిమాలతో దుమ్ము దులిపేస్తోంది. ఏక్ థా టైగర్ .. టైగర్ జిందా హై చిత్రాల్లో సల్మాన్ - కత్రిన జోడీ నటించారు. అవి రెండూ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో మూడో సినిమాకి సన్నాహకాల్లో ఉన్నారు. ఇందులోనూ కత్రిన యాక్షన్ క్వీన్ గా కనిపించనుందట. 2021 ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం.