Begin typing your search above and press return to search.

చిరు - నాగ్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి...!

By:  Tupaki Desk   |   17 Jun 2020 1:00 PM GMT
చిరు - నాగ్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి...!
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మానసిక ఒత్తిడి తట్టుకోలేక ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశాంత్ మరణంపై సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ప్రతీ ఒక్కరూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అయితే సుశాంత్ కి అవకాశాలు రాకుండా చేయడం వల్లనే సుశాంత్‌ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నాడంటూ బాలీవుడ్‌ పెద్దలపై గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 'నెపోటిజం' పై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇండస్ట్రీలో నెపోటిజం వలన టాలెంటెడ్ యాక్టర్స్ ఎదగడం లేదని ఒక వీడియో రూపంలో చెప్పిన విషయాలు వైరల్ అయ్యాయి. ఇక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా సినీ ఇండస్ట్రీలో ఉండే నెపోటిజంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇప్పుడు ఈ విషయంపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా ఫేస్ బుక్ లో స్పందించింది. అయితే శ్రీరెడ్డి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా నెపోటిజం ఉందంటూ స్టార్ యాక్టర్స్ పై తీవ్ర పదజాలంతో పోస్ట్ పెట్టింది.

శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెడుతూ.. ''గట్స్ లేని మూవీ లెజండ్స్ మాత్రమే న్యూ టాలెంట్ ని చంపేస్తున్నారు. సేమ్ ఆన్ యూ సో కాల్డ్ చిరంజీవి - నాగార్జున - బాలీవుడ్ ఖాన్స్ మరియు కపూర్ ఫ్యామిలీస్'' అని కామెంట్ పెట్టింది. ఈ పోస్ట్ లో కొన్ని అసభ్యకరమైన పదజాలాన్ని కూడా ఉపయోగించింది. శ్రీరెడ్డి తెలుగు ఇండస్ట్రీలో నెపోటిజంపై వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. స్టార్ హీరోలైన చిరంజీవి - నాగార్జునపై తీవ్ర పదజాలంతో విరుచుకు పడడం చర్చనీయాంశమైంది. శ్రీరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు అందరూబాలీవుడ్ లో బంధుప్రీతి గురించే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు శ్రీరెడ్డి నెపోటిజం గాలిని టాలీవుడ్ వైపు మళ్లించింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదాస్పద నటి చేసిన వివాదాస్పద కామెంట్స్ పై ఇండస్ట్రీ జనాలు ఎలా స్పందిస్తారో చూడాలి.