Begin typing your search above and press return to search.

డైలామాలో 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్' టీమ్...?

By:  Tupaki Desk   |   29 Sep 2020 10:32 AM GMT
డైలామాలో సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ టీమ్...?
X
మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ లేటెస్ట్ మూవీ 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్'ని ఓటీటీలో రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు సుబ్బు రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌‌ పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మించాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. జీ 5 ఒరిజినల్ ఓటీటీ సంస్థ చిత్ర బృందంతో ఒప్పందం కుదుర్చుకుందని.. 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రానికి సుమారు రూ.35 కోట్లకు డీల్ సెట్ అయిందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా దసరా కానుకగా పే ఫర్‌ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురడానికి ప్రణాళికలు జరుగుతున్నట్లు ఓటీటీ వర్గాల్లో అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ వేదికపై చిత్ర బృందం ఇంకా డైలామాలో ఉందని తెలుస్తోంది.

కాగా, క‌రోనా ప‌రిస్థితులుకి జ‌నాలు అల‌వాటు ప‌డుతుండ‌టంతో కేంద్రం ఇప్పటికే నిబంధనలు సడలిస్తూ వస్తోంది. ఈ క్రమంలో థియేటర్స్ రీ ఓపెన్ చేయాలని ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ నుండి డిమాండ్ పెరుగుతుండటంతో సినిమా థియేటర్స్ తెరిచేందుకు అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్' సినిమాని కొనుక్కున్న జీ5 వారితో ఈ మూవీని థియేట‌ర్ రిలీజ్ చేయించాల‌ని చిత్ర బృందం డిసైడ్ అయిన‌ట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఒకవేళ థియేటర్స్ రీ ఓపెన్ చేయడానికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే మాత్రం ముందుగా అనుకున్నట్లే వ‌చ్చే నెల‌లో ఈ సినిమాను జీ 5 ఓటీటీలో విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. మరి మెగా మేనల్లుడు సినిమా విడుదలపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.