Begin typing your search above and press return to search.

ఈసారి ఆద్య మిస్స‌య్యిందేం సితా పాపా?

By:  Tupaki Desk   |   24 Jan 2021 2:30 PM GMT
ఈసారి ఆద్య మిస్స‌య్యిందేం సితా పాపా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫ్యామిలీ ప్ర‌స్తుతం దుబాయ్ వెకేష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే కుటుంబ స‌మేతంగా శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి బ‌య‌ల్దేరిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. అక్క‌డ మ‌హేష్ షార్ట్ వెకేష‌న్ ముగించి త‌దుప‌రి స‌ర్కార్ వారి పాట దుబాయ్ షెడ్యూల్ ని పూర్తి చేస్తారు.

ఇప్ప‌టికే మ‌హేష్ త‌న గారాల ప‌ట్టీల‌తో బీచ్ వెకేష‌న్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోల్ని ష‌స్త్రర్ చేశారు. తాజాగా సితార ఘ‌ట్ట‌మ‌నేని స్పీడ్ బోటింగ్ కి వెళ్లిన జ్ఞాప‌కాల్ని ఫోటోల రూపంలో బంధించి అభిమానుల‌కు ఇన్ స్టాలో షేర్ చేసింది. మెమ‌రీస్ బై ద బీచ్! దుబాయ్ డైరీస్..# వేకే టైమ్.. అంటూ సితార ఈ ఫోటోని షేర్ చేయ‌గా అది అభిమానుల్లో వైర‌ల్ అవుతోంది.

అన్న‌ట్టు త‌న‌తో పాటే ఎవ‌రెవ‌రు ఉన్నారు స్పీడ్ బోటింగులో? అంటే.. త‌న సోద‌రుడు గౌత‌మ్ ఘ‌ట్ట‌మ‌నేని .. క‌జిన్ జారా జేవియ‌ర్ కూడా ఉన్నారు. స్పీడ్ బోటింగ్ కి వెళ్లిన‌ప్పుడు ఎంతో ప‌క‌డ్భందీగా ర‌క్ష‌ణ క‌వ‌చం ధ‌రించారు. దాంతో పాటే ఇలా ఫోటో దిగారు. ఆ బీచ్ ఇసుక‌లో మ‌ర బోట్లు ఉన్నాయి చూసారు క‌దా? వాటిలో డేరింగ్ గా బులుగు స‌ముద్రంలోకి వెళ్లిపోయార‌న్న‌మాట‌. ఈసారి ట్రిప్ లో సితార బెస్ట్ ఫ్రెండ్ ఆద్య (వంశీ పైడి ప‌ల్లి కుమార్తె) మిస్స‌య్యిందేమిటో!