Begin typing your search above and press return to search.

సీతారామం 3 రోజుల కలెక్షన్స్.. మళ్ళీ పెరిగింది

By:  Tupaki Desk   |   8 Aug 2022 10:30 AM GMT
సీతారామం 3 రోజుల కలెక్షన్స్.. మళ్ళీ పెరిగింది
X
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నుంచి వచ్చిన సీతారామం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుంది. దుల్కర్ సల్మాన్, మృనల్ ఠాగూర్ జంటగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొత్తానికి మంచి ప్రేమ కావ్యం అని సినీ ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే అందుకుంటుంది.

ఇక రోజురోజుకు కలెక్షన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉహించని కలెక్షన్స్ అందుకుంది. ఇక మూడవరోజు అంతకంటే ఎక్కువగా వసూళ్ళు రావడం విశేషం. ఇక మొత్తంగా ఏపీ తెలంగాణలో సీతారామం సినిమా మూడు రోజుల్లో 12.77 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.

ఇక కేరళలో చూసుకుంటే ఈ సినిమా 2.14 కోట్లు అందుకోగా తమిళనాడులో 1.60 కోట్లు వచ్చాయి.
తమిళనాడులో 1.60 కోట్లు, కర్ణాటక లో 1.75కోట్లు, ఇక ఓవర్సీస్ లో ఊహించిన దానికంటే ఎక్కువగా కలెక్షన్స్ మరింత పెరిగాయి. దీంతో మూడు రోజులకు గాను ఓవర్సీస్ లో సీతారామం సినిమా 6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మొత్తంగా సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 24.26 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

చూస్తుంటే ఈ సినిమా వీకెండ్ తర్వాత కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు బింబిసారా సినిమా యాక్షన్ ప్రియులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నప్పటికీ కూడా సీతారామం సినిమాకు జనాల సంద్రత ఏమాత్రం తగ్గలేదు. సోమవారం తో పాటు రాబోయే రెండు రోజుల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి మొత్తంగా ఈ సినిమా ద్వారా వైజయంతి మూవీస్ ఏ స్థాయిలో ప్రాఫిట్స్ అందుకుంటుందో చూడాలి.