Begin typing your search above and press return to search.
తన అనుమతి లేకుండా తన సినిమా రీమేక్.. దర్శకుడి పోరాటం!
By: Tupaki Desk | 24 Feb 2020 10:30 PM GMTబాలీవుడ్ లో మిస్టర్ ఇండియా 2 విషయంలో రాద్ధాంతం కొనసాగుతూ ఉంది. ఈ సినిమాను తీయబోతున్నట్టుగా అలీ అబ్బాస్ జాఫర్ ప్రకటించినప్పటి నుంచి ఇదొక వివాదంగా మారుతూ ఉంది. ఒరిజినల్ మిస్టర్ ఇండియా రూపకర్తలు ఈ విషయంలో గుర్రుగా ఉన్నారు.
వీరిలో ముందు వరసలో ఉన్నాడు దర్శకుడు శేఖర్ కపూర్. 1987లో అనిల్ కపూర్ హీరోగా మిస్టర్ ఇండియా సినిమాను తీసింది ఆయనే. అనిల్ కపూర్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్. ఆ సినిమా, పాటలు, డ్యాన్సులు.. అవన్నీ కల్ట్ హిట్ హిందీ జనాల్లో. అలా ఆ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్లో, రీమేకో ఏదో కానీ మిస్టర్ ఇండియా 2 అంటూ ఒక సినిమాను అనౌన్స్ చేశారు. ఈ విషయంలో శేఖర్ కపూర్ ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు.
మిస్టర్ ఇండియా రీమేక్-సీక్వెల్ విషయంలో తనను ఎవరూ స్పందించలేదని ఆయన ప్రకటించారు. తను లేకుండా ఆ సినిమాను తీస్తారేమో కానీ, మిస్టర్ ఇండియాలో అద్భుత విలనిజాన్ని పండించిన అమ్రిష్ పురి లేకుండా ఆ సినిమాను తీయడం సాధ్యమా? అని ఆయన నెటిజన్లను ప్రశ్నించారు. అలా మిస్టర్ ఇండియా కొనసాగింపును ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. అలాగే ఈ విషయం లో అనిల్ కపూర్ ను కూడా స్పందించినట్టుగా లేరు! అనిల్ కపూర్ తనయ సోనమ్ ఈ విషయంలో స్పందించింది. తన తండ్రిని కూడా ఎవరూ స్పందించ లేదని ఆమె చెప్పింది. ఇలా మిస్టర్ ఇండియా హీరో, మిస్టర్ ఇండియా డైరెక్టర్.. ఇద్దరూ ఈ లేటెస్ట్ వెర్షన్ కు వ్యతిరేకంగా స్పందిస్తున్నట్టు గా అవుతోంది.
అంతే కాదు.. ఈ విషయం లో శేఖర్ కపూర్ మరింత పోరాటానికి రెడీ అవుతున్నారట. ఇలాంటి సీక్వెల్స్ విషయం లో ఒరిజినల్ రైటర్ల అనుమతి ఉండాలనే డిమాండ్ ను ఆయన తెర మీదకు తెస్తున్నారు.
వీరిలో ముందు వరసలో ఉన్నాడు దర్శకుడు శేఖర్ కపూర్. 1987లో అనిల్ కపూర్ హీరోగా మిస్టర్ ఇండియా సినిమాను తీసింది ఆయనే. అనిల్ కపూర్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్. ఆ సినిమా, పాటలు, డ్యాన్సులు.. అవన్నీ కల్ట్ హిట్ హిందీ జనాల్లో. అలా ఆ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్లో, రీమేకో ఏదో కానీ మిస్టర్ ఇండియా 2 అంటూ ఒక సినిమాను అనౌన్స్ చేశారు. ఈ విషయంలో శేఖర్ కపూర్ ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు.
మిస్టర్ ఇండియా రీమేక్-సీక్వెల్ విషయంలో తనను ఎవరూ స్పందించలేదని ఆయన ప్రకటించారు. తను లేకుండా ఆ సినిమాను తీస్తారేమో కానీ, మిస్టర్ ఇండియాలో అద్భుత విలనిజాన్ని పండించిన అమ్రిష్ పురి లేకుండా ఆ సినిమాను తీయడం సాధ్యమా? అని ఆయన నెటిజన్లను ప్రశ్నించారు. అలా మిస్టర్ ఇండియా కొనసాగింపును ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. అలాగే ఈ విషయం లో అనిల్ కపూర్ ను కూడా స్పందించినట్టుగా లేరు! అనిల్ కపూర్ తనయ సోనమ్ ఈ విషయంలో స్పందించింది. తన తండ్రిని కూడా ఎవరూ స్పందించ లేదని ఆమె చెప్పింది. ఇలా మిస్టర్ ఇండియా హీరో, మిస్టర్ ఇండియా డైరెక్టర్.. ఇద్దరూ ఈ లేటెస్ట్ వెర్షన్ కు వ్యతిరేకంగా స్పందిస్తున్నట్టు గా అవుతోంది.
అంతే కాదు.. ఈ విషయం లో శేఖర్ కపూర్ మరింత పోరాటానికి రెడీ అవుతున్నారట. ఇలాంటి సీక్వెల్స్ విషయం లో ఒరిజినల్ రైటర్ల అనుమతి ఉండాలనే డిమాండ్ ను ఆయన తెర మీదకు తెస్తున్నారు.