Begin typing your search above and press return to search.
2004 హిట్ మూవీకి ఇప్పుడు సీక్వెల్
By: Tupaki Desk | 29 Jan 2023 5:00 AM GMTతమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమాల్లో '7/జీ బృందావన్ కాలనీ' ఒకటి. 2004 లో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఈ చిత్రం యూత్ను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
కుర్రాళ్లను ఓ ఊపు ఊపింది. నిర్మాత ఎంఎం.రత్నం నిర్మించిన ఈ మూవీతో ఆయన కుమారుడు రవికృష్ణ కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఇందులో సోనియా అగర్వాల్ హీరోయిన్గా నటించారు. వీరిద్దరి మధ్య రొమాన్స్ సీన్స్ కెమిస్ట్రీని అద్భుతంగా పండించారు దర్శకుడు సెల్వ. వీటికి యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు.
ఇకపోతే యువన్శంకర్ రాజా సంగీతం అందించిన ఇందులోని పాటలు కూడా సూపర్హిట్ అయ్యాయి. యూత్ను ఉర్రూతలూగించాయి. ఇప్పటికీ చాలామంది ఈ పాటలను వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ అయితే వీటిని పెట్టుకునే వింటారు. అయితే ఇప్పుడీ సినిమా అభిమానులకు ఓ గుడ్ న్యూస్.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం 7/జీ బృందావన్ కాలనీ సినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల ఏం రత్నం ఓ వేదికపై ఈ సినిమా సీక్వెల్ నిర్మించాలని ఆలోచన ఉన్నట్లు తెలిపారు. అందుకోసం ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడా ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. త్వరలోనే ఇది రూపొందే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇందులో హీరో హీరోయిన్లు ఎవరు దర్శకుడు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే హీరో రవికృష్ణ ఆ సినిమా తర్వాత సుక్రన్, కేడీ, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, నిన్న నేడు రేపు వంటి కొన్ని చిత్రాల్లో నటించినా అవేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. దీంతో ఆయన చాలాకాలం నటనకు దూరంగా ఉంటున్నారు.
అయితే ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు నిర్మాతల్లో ఎం ఎం రత్న కూడా ఒకరట. బహుశా ఈ సినిమా తర్వాతే 7/జీ బృందావన్ కాలనీ సీక్వెల్ పై దృష్టి పెడతారని తెలుస్తోంది. మరి ఇందులో రవికృష్ణ నటిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
కుర్రాళ్లను ఓ ఊపు ఊపింది. నిర్మాత ఎంఎం.రత్నం నిర్మించిన ఈ మూవీతో ఆయన కుమారుడు రవికృష్ణ కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఇందులో సోనియా అగర్వాల్ హీరోయిన్గా నటించారు. వీరిద్దరి మధ్య రొమాన్స్ సీన్స్ కెమిస్ట్రీని అద్భుతంగా పండించారు దర్శకుడు సెల్వ. వీటికి యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు.
ఇకపోతే యువన్శంకర్ రాజా సంగీతం అందించిన ఇందులోని పాటలు కూడా సూపర్హిట్ అయ్యాయి. యూత్ను ఉర్రూతలూగించాయి. ఇప్పటికీ చాలామంది ఈ పాటలను వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ అయితే వీటిని పెట్టుకునే వింటారు. అయితే ఇప్పుడీ సినిమా అభిమానులకు ఓ గుడ్ న్యూస్.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం 7/జీ బృందావన్ కాలనీ సినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల ఏం రత్నం ఓ వేదికపై ఈ సినిమా సీక్వెల్ నిర్మించాలని ఆలోచన ఉన్నట్లు తెలిపారు. అందుకోసం ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడా ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. త్వరలోనే ఇది రూపొందే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇందులో హీరో హీరోయిన్లు ఎవరు దర్శకుడు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే హీరో రవికృష్ణ ఆ సినిమా తర్వాత సుక్రన్, కేడీ, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, నిన్న నేడు రేపు వంటి కొన్ని చిత్రాల్లో నటించినా అవేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. దీంతో ఆయన చాలాకాలం నటనకు దూరంగా ఉంటున్నారు.
అయితే ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు నిర్మాతల్లో ఎం ఎం రత్న కూడా ఒకరట. బహుశా ఈ సినిమా తర్వాతే 7/జీ బృందావన్ కాలనీ సీక్వెల్ పై దృష్టి పెడతారని తెలుస్తోంది. మరి ఇందులో రవికృష్ణ నటిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.