Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో హిట్ సినిమా తీయాలని కంకణం కట్టుకున్న సీనియర్ ప్రొడ్యూసర్..!

By:  Tupaki Desk   |   16 Jun 2021 10:30 AM GMT
ఎన్టీఆర్ తో హిట్ సినిమా తీయాలని కంకణం కట్టుకున్న సీనియర్ ప్రొడ్యూసర్..!
X
భారతీయ సినీ పరిశ్రమలోని భారీ నిర్మాణ సంస్థల్లో వైజయంతీ మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నందమూరి తారక రామారావు హీరోగా ‘ఎదురులేని మనిషి’ అనే సినిమాతో నిర్మాతగా మారిన చలసాని అశ్వినీద‌త్.. ఐదు దశాబ్దాలుగా సినిమాలు నిర్మిస్తూ తెలుగు సినిమా చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. 50 ఏళ్ల జర్నీలో రెండు తరాలకు వారధిగా నిలిచిన అశ్వినీ దత్.. ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతోన్న అందరితో సినిమాలు తీశారు. ఎందరో నటవారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత వైజయంతీ సంస్థ సొంతం.

ఎన్టీఆర్ సువర్ణ హస్తాలతో లిఖించబడిన వైజయంతీ సంస్థ.. ఆయన మనవడు జూ.ఎన్టీఆర్ తో ఇప్పటి మూడు సినిమాలు చేశారు. అందులో 'స్టూడెంట్ నెం.1' హిట్ అవ్వగా.. 'కంత్రి' 'శక్తి' సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అందుకే తారక్ తో హిట్ సినిమాలు తీసి.. సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే జూనియర్ తో బంధాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో తమిళ దర్శకుడు అట్లీ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ సెట్ చేయడానికి మూడేళ్ళ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లకు ఈ క్రేజీ కాంబో ఫైనల్ కాబోతోందని టాక్ వినిపిస్తోంది.

షారుఖ్ ఖాన్ తో అట్లీ మూవీ పూర్తైన వెంటనే తారక్ తో సినిమా ఉంటుందని అంటున్నారు. వైజయంతీ మూవీస్ - స్వప్న సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కనుంది. మరి ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి సీనియర్ ఎన్టీఆర్ తో పెనవేసుకున్న బంధాన్ని అశ్వినీదత్.. జూ.ఎన్టీఆర్ తో గట్టిపరుచుకుంటాడేమో చూడాలి. ఇకపోతే వైజయంతీ బ్యానర్ లో ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ - హను రాఘవపూడి కాంబోలో 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనే త్రిభాషా చిత్రం రూపొందుతోంది. అలానే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కలయికలో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ చేయనున్నారు.