Begin typing your search above and press return to search.
భయంకరమైన తప్పులు చూసీ ప్రేమించాడన్న సామ్!
By: Tupaki Desk | 22 Sep 2021 10:30 AM GMTతాను భయంకరమైన తప్పులు చేయడం చైతన్య చూశారని .. ఆ తర్వాతే ప్రేమలో పడ్డామని ఒకానొక ఇంటర్వ్యూలో సమంత అన్న వ్యాఖ్యలను ఇప్పుడు అక్కినేని అభిమానులు సహా బాలీవుడ్ మీడియా హైలైట్ చేయడం ప్రముఖంగా చర్చకు వచ్చింది.
సమంత అక్కినేని తన భర్త నాగ చైతన్య గురించి 2019 లో మంచు లక్ష్మీతో `ఫీట్ అప్ విత్ ది స్టార్స్` (తెలుగు) లో పాల్గొన్నప్పుడు మాట్లాడిన విషయమిది. అతను `తన దిండును వివాహం చేసుకున్నాడు` అని ఆ ఇంటర్వ్యూలో సామ్ చమత్కరించారు.
సమంత అక్కినేని ఆ చాటింగ్ సెషన్ లో కనిపించినప్పుడు నాగ చైతన్యపై ప్రశంసల వర్షం కురిపించారు. అతడిని `భర్త మెటీరియల్` అని పొగిడేసారు. హోస్ట్ లక్ష్మీ మంచుతో పెళ్లికి ముందు తాము లివ్-ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నామని వెల్లడించారు ఆ చాటింగ్ లో.
చైతన్య పూర్తిగా హజ్బెండ్ మెటీరియల్. అతను నన్ను జీరో స్థాయి నుండి చూశాడు. అమెరికా నుండి నా తల్లికి కాల్ చేయడానికి నా దగ్గర డబ్బు లేని విషయం నాకు ఇంకా గుర్తుంది. నేను అతని ఫోన్ తీసుకుని ఇంటికి కాల్ చేసాను. చైతన్య నన్ను ఆ పరిస్థితి నుండి.. నేటి ఈ స్థాయి వరకూ చూశాడు కాబట్టి... అది మరెవరైనా ఎలా ఉంటుంది.. సరియైనదా? అని తనతో జీవించే ముందు ఆలోచించానని తెలిపారు.
మనిషిగా కూడా నేను చాలా భయంకరమైన తప్పులు చేయడాన్ని అతను చూశాడు అని సమంత అన్నారు. మనలో గర్వించేంత గొప్ప విషయాలు లేనప్పటికీ మనల్ని ప్రేమించడం చాలా పెద్ద విషయం అని అన్నారు.
చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత బెడ్ రూమ్ కు సంబంధించిన మూడు విషయాలను చెప్పమని సమంతను లక్ష్మీ మంచు అడిగారు. సమంత ముసిముసిగా నవ్వుతుండగా..`` మీరు ఇంతకు ముందు కలిసి జీవిస్తున్నారని నేను చెప్పలేను ...`` అంటూ.. ఇద్దరు నవ్వుల్లో మునిగిపోయారు.
లక్ష్మి తిరిగి ప్రశ్నించారు. ``ఒక వ్యక్తితో ఒంటరిగా ఉండటం.. పడకగదిలో తేడాలు వగైరా ఏమిటి?`` అని ప్రశ్నించగా.. సమంత సమాధానమిస్తూ.. ..``చైతూ తన దిండును వివాహం చేసుకున్నాడు. నేను అతన్ని కౌగిలించుకోవాల్సి వచ్చినప్పటికీ దిండు ఎల్లప్పుడూ మా మధ్య ఉంటుంది. నేను ఇంకా ఎక్కువ చెబితే అతను నన్ను చంపబోడు. నేను ఎక్కువే చెప్పానని అనుకుంటున్నాను`` అంటూ సరదాగా సంభాషించారు.
2017 లో సమంత - చైతన్య వివాహం చేసుకున్నారు. ఈ జంట నడుమ విభేధాలపై రకరకాల పుకార్లు షికార్ చేస్తున్న వేళ నాటి లక్ష్మీ మంచుతో సామ్ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇటీవల సమంత తిరుమల ఆలయం నుండి తిరిగి వస్తుండగా.. ఒక రిపోర్టర్ చైతన్య నుండి విడిపోతున్నట్లు వచ్చిన పుకార్లపై వ్యాఖ్యానించమని కోరగా సామ్ అతడిపై తీవ్రంగా ఫైరయ్యారు. ``గుడికి వచ్చాను.. బుద్ధి ఉందా?`` అంటూ సీరియస్ అయ్యారు. ఇటీవల సామాజిక మాధ్యమాల వేదికగా సమంత వ్యాఖ్యలు స్పీడ్ గా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందే కర్మ సిద్ధాంతంపై సద్గురు ప్రవచనాన్ని సామ్ సోషల్ మీడియాల్లో షేర్ చేయగా వైరల్ గా మారింది. ఇంతకుముందు నాగార్జున ను మామ అని సంబోధిస్తూ సోషల్ మీడియాల్లో సమంత వ్యాఖ్యానించడం .. అనంతరం బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్న నాగార్జున పై ప్రశంసలు కురిపించడం వగైరా యాక్టివిటీస్ తో సమంత అభిమానులను కన్ఫ్యూజ్ చేయడం గురించి ఇప్పుడు నెటిజనుల్లో డిబేట్లు వేడెక్కిస్తున్నాయి.
సమంత అక్కినేని తన భర్త నాగ చైతన్య గురించి 2019 లో మంచు లక్ష్మీతో `ఫీట్ అప్ విత్ ది స్టార్స్` (తెలుగు) లో పాల్గొన్నప్పుడు మాట్లాడిన విషయమిది. అతను `తన దిండును వివాహం చేసుకున్నాడు` అని ఆ ఇంటర్వ్యూలో సామ్ చమత్కరించారు.
సమంత అక్కినేని ఆ చాటింగ్ సెషన్ లో కనిపించినప్పుడు నాగ చైతన్యపై ప్రశంసల వర్షం కురిపించారు. అతడిని `భర్త మెటీరియల్` అని పొగిడేసారు. హోస్ట్ లక్ష్మీ మంచుతో పెళ్లికి ముందు తాము లివ్-ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నామని వెల్లడించారు ఆ చాటింగ్ లో.
చైతన్య పూర్తిగా హజ్బెండ్ మెటీరియల్. అతను నన్ను జీరో స్థాయి నుండి చూశాడు. అమెరికా నుండి నా తల్లికి కాల్ చేయడానికి నా దగ్గర డబ్బు లేని విషయం నాకు ఇంకా గుర్తుంది. నేను అతని ఫోన్ తీసుకుని ఇంటికి కాల్ చేసాను. చైతన్య నన్ను ఆ పరిస్థితి నుండి.. నేటి ఈ స్థాయి వరకూ చూశాడు కాబట్టి... అది మరెవరైనా ఎలా ఉంటుంది.. సరియైనదా? అని తనతో జీవించే ముందు ఆలోచించానని తెలిపారు.
మనిషిగా కూడా నేను చాలా భయంకరమైన తప్పులు చేయడాన్ని అతను చూశాడు అని సమంత అన్నారు. మనలో గర్వించేంత గొప్ప విషయాలు లేనప్పటికీ మనల్ని ప్రేమించడం చాలా పెద్ద విషయం అని అన్నారు.
చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత బెడ్ రూమ్ కు సంబంధించిన మూడు విషయాలను చెప్పమని సమంతను లక్ష్మీ మంచు అడిగారు. సమంత ముసిముసిగా నవ్వుతుండగా..`` మీరు ఇంతకు ముందు కలిసి జీవిస్తున్నారని నేను చెప్పలేను ...`` అంటూ.. ఇద్దరు నవ్వుల్లో మునిగిపోయారు.
లక్ష్మి తిరిగి ప్రశ్నించారు. ``ఒక వ్యక్తితో ఒంటరిగా ఉండటం.. పడకగదిలో తేడాలు వగైరా ఏమిటి?`` అని ప్రశ్నించగా.. సమంత సమాధానమిస్తూ.. ..``చైతూ తన దిండును వివాహం చేసుకున్నాడు. నేను అతన్ని కౌగిలించుకోవాల్సి వచ్చినప్పటికీ దిండు ఎల్లప్పుడూ మా మధ్య ఉంటుంది. నేను ఇంకా ఎక్కువ చెబితే అతను నన్ను చంపబోడు. నేను ఎక్కువే చెప్పానని అనుకుంటున్నాను`` అంటూ సరదాగా సంభాషించారు.
2017 లో సమంత - చైతన్య వివాహం చేసుకున్నారు. ఈ జంట నడుమ విభేధాలపై రకరకాల పుకార్లు షికార్ చేస్తున్న వేళ నాటి లక్ష్మీ మంచుతో సామ్ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇటీవల సమంత తిరుమల ఆలయం నుండి తిరిగి వస్తుండగా.. ఒక రిపోర్టర్ చైతన్య నుండి విడిపోతున్నట్లు వచ్చిన పుకార్లపై వ్యాఖ్యానించమని కోరగా సామ్ అతడిపై తీవ్రంగా ఫైరయ్యారు. ``గుడికి వచ్చాను.. బుద్ధి ఉందా?`` అంటూ సీరియస్ అయ్యారు. ఇటీవల సామాజిక మాధ్యమాల వేదికగా సమంత వ్యాఖ్యలు స్పీడ్ గా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందే కర్మ సిద్ధాంతంపై సద్గురు ప్రవచనాన్ని సామ్ సోషల్ మీడియాల్లో షేర్ చేయగా వైరల్ గా మారింది. ఇంతకుముందు నాగార్జున ను మామ అని సంబోధిస్తూ సోషల్ మీడియాల్లో సమంత వ్యాఖ్యానించడం .. అనంతరం బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్న నాగార్జున పై ప్రశంసలు కురిపించడం వగైరా యాక్టివిటీస్ తో సమంత అభిమానులను కన్ఫ్యూజ్ చేయడం గురించి ఇప్పుడు నెటిజనుల్లో డిబేట్లు వేడెక్కిస్తున్నాయి.