Begin typing your search above and press return to search.

'సర్కారు వారి పాట' ఏ హీరోయిన్ పాడుతుందో!

By:  Tupaki Desk   |   4 Jun 2020 12:00 PM GMT
సర్కారు వారి పాట ఏ హీరోయిన్ పాడుతుందో!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో "సర్కారు వారి పాట" సినిమా రానున్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు తర్వాత పరశురామ్‌తో మహేష్ బాబు ఓకే అన్నారు. ముందుగా వంశీ పైడిపల్లితో ఓకే చేసిన మహేష్.. తర్వాత పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో ఫైనల్‌ చేసేసాడు. ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా మహేష్ ఈ సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌ నుండి మొదలవుతుందని సమాచారం. అయితే ఇప్పుడు మహేష్ కోసం హీరోయిన్ ని వెతికే పనిలో పడింది చిత్ర బృందం. అందులో భాగంగా ఈ సినిమాలో మహేష్ సరసన భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీని తీసుకోవాలనీ చూశారట. అందులో భాగంగా ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం. అయితే అమ్మడు ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ మూవీ చేసేలా కనిపించడం లేదట.

అయితే తాజాగా కియారా కాకుండా మరో బ్యూటీని కూడా సెలెక్ట్ చేసిందట టీమ్. ఆమె ఎవరో కాదు దబాంగ్ 3 తో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్. దబాంగ్3 సినిమాతో కుర్ర హృదయాలు దోచుకున్న ఈ భామ ప్రస్తుతం తన తెలుగు డెబ్యూ సినిమాలో నటిస్తుంది. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న బాక్సర్ సినిమాతో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా పరిచయం కానుంది. అయితే మహేష్ సరసన ఈ బ్యూటీ నిజంగా ఓకే అయితే మాత్రం చాలా లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే ఏ హీరోయిన్ కూడా మహేష్ పక్కన ఛాన్స్ అంటే అసలు వదులుకోరు. అలాంటిది సాయి మంజ్రేకర్ ఛాన్స్ కొడితే గనక ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు క్యూ కడతాయని చెప్పవచ్చు. ఈ బ్యూటీ ఎవరో కాదు తెలుగులో చాలా సినిమాలలో నటించిన మహేష్ మంజ్రేకర్ కూతురే ఈ సాయి మంజ్రేకర్. సర్కారు వారి పాటలో హీరోయిన్గా ఓకే అయితే అమ్మడి ఫేట్ మారిపోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. చూడాలి మరి పరశురామ్ టీమ్ ఎవరినీ ఎంచుకుంటుందో!